నా ఆస్తులు వెల్లడిస్తే ప్రాణాపాయం: ప్రియాంక గాంధీ లేఖ
న్యూఢిల్లీ: తన ఆస్తుల వివరాలు బయటపడితే నా ప్రాణాలకే ప్రమాదం రావొచ్చునని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంక వాద్రా అన్నారు. దయచేసి, ఆ వివరాలు రహస్యంగా ఉంచండని ఆమె హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. హిమాచల్లో ప్రియాంక ఆస్తులు సమకూర్చుకోవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

ఆ వివరాలు చెప్పాలంటూ దేబాశిష్ భట్టాచార్య రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాచార హక్కు కింద కోరారు. ఆమెకు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి, వాటి సేల్ డీడ్స్, డాక్యుమెంట్లు, పవర్ ఆఫ్ అటార్నీ వివరాలు అడిగారు. నిరుడు పెట్టుకున్న ఈ దరఖాస్తుపై అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. అయితే అక్కడి అధికారులు ప్రియాంక ఆస్తుల వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.
ప్రియాంక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రత పొందుతున్నారని, ఆమె ఆస్తుల గురించి బయటికి చెప్పలేమని తేల్చేశారు. ఇదే క్రమంలో నిరుడు జులైలో ప్రియాంక కూడా హిమాచల్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు.












Click it and Unblock the Notifications