జగన్నాథుని రథయాత్ర: భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు
భువనేశ్వర్: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి విశ్వప్రసిద్ధ రథయాత్ర(141వ)కు పూరీ శ్రీక్షేత్రం సిద్ధమైంది. శనివారం పూరీ జగన్నాథుడు భక్త జనఘోష మధ్య బలభద్ర, సుభద్రలతో కలసి రథాలపై గుండిచా(పెంచినతల్లి) మందిరానికి చేరుకోనున్నాడు. ఈ యాత్ర తిలకించడానికి యాత్రికులు శుక్రవారమే పెద్ద సంఖ్యలో పూరీ చేరుకున్నారు.
దేశ, విదేశాల నుంచి చేరుకుంటున్న భక్తులతో మఠాలు, ఆశ్రమాలు, ధర్మశాలలు, హోటళ్లు నిండిపోయాయి. స్నానయాత్ర (జ్యేష్ట పూర్ణిమనాడు) వేడుకలో జలక్రీడలాడిన చతుర్థామూర్తులు (జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు) అస్వస్థతకులోనై పక్షం రోజులపాటు ఒనొసొనొ (చీకటి) మందిరంలో చేరిన విషయం తెలిసిందే.

ఇక్కడే స్వామికి గోప్య చికిత్స, సేవలు జరిగాక ఆరోగ్యవంతుడై శుక్రవారం నవయవ్వన రూపంలో (నేత్రోత్సవం) భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ శుక్ల విదియనాడు(శనివారం) ముగ్గురు మూర్తులు నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలపై గుండిచాదేవి మందిరానికి చేరుకుంటారు. కాగా, అక్కడ తొమ్మిది రోజులు విడిది చేయనున్నారు.
ఇప్పుడు పూరి క్షేత్రమంతా జగన్నాథుడి నామస్మరణత మారుమ్రోగిపోతోంది. రథయాత్ర నేపథ్యంలో శనివారం నిర్ణీత వేళల్లో పురుషోత్తమ సేవలు ఏర్పాటయ్యేలా శ్రీక్షేత్ర యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఒడిశా ప్రభుత్వం రథయాత్రను విజయవంతం చేయడానికి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జగన్నాథుడి యాత్ర నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications