అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మందిరం కోసం ఇతోధికంగా ప్రతీ ఒక్కరు సాయం చేస్తున్నారు. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు విరాళం అందజేశారు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన.. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. సొంత పార్టీ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోనూ ఉంటూ విమర్శల జడివాన కురిపిస్తున్నారు.
రామ మందిర నిర్మాణం కోసం 3 నెలల వేతనాన్ని రఘురామ విరాళం అందజేశారు. అంటే రూ. 3.9 లక్షలు విరాళం ఇచ్చినట్టు ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇవాళ భక్తులతో కలిసి రూ.1,11,111 అందజేశారు. రామ మందిరం నిర్మాణం అనేది శతాబ్దాల కాలం నాటి స్వప్నం అని తెలిపారు. దీనిని నెరవేర్చేందుకు ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత ఇవ్వాలని కోరారు. మందిరం కోసం రూ.100 ఇచ్చినా విరాళమే అవుతోందని చెప్పారు. రూ. లక్ష ఇచ్చినా విరళమేనని.. శక్తి మేరకు సాయం చేయాలని కోరారు.

అయోధ్య భూ వివాదానికి గత ఏడాది తెరపడిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో.. మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. హిందువులకు మందిరం, ముస్లింలకు మరో చోట 5 ఎకరాల భూమి కేటాయించాలని తీర్పునిచ్చింది. ఆ తర్వాత భూమి పూజ చేశారు. అయితే కరోనా వైరస్ విజృంభించడంతో భూమి పూజ కార్యక్రమం వాయిదాపడింది. ఆగస్ట్ నెలలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా క్రతువు చేశారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications