అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మందిరం కోసం ఇతోధికంగా ప్రతీ ఒక్కరు సాయం చేస్తున్నారు. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు విరాళం అందజేశారు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన.. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. సొంత పార్టీ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోనూ ఉంటూ విమర్శల జడివాన కురిపిస్తున్నారు.
రామ మందిర నిర్మాణం కోసం 3 నెలల వేతనాన్ని రఘురామ విరాళం అందజేశారు. అంటే రూ. 3.9 లక్షలు విరాళం ఇచ్చినట్టు ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇవాళ భక్తులతో కలిసి రూ.1,11,111 అందజేశారు. రామ మందిరం నిర్మాణం అనేది శతాబ్దాల కాలం నాటి స్వప్నం అని తెలిపారు. దీనిని నెరవేర్చేందుకు ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత ఇవ్వాలని కోరారు. మందిరం కోసం రూ.100 ఇచ్చినా విరాళమే అవుతోందని చెప్పారు. రూ. లక్ష ఇచ్చినా విరళమేనని.. శక్తి మేరకు సాయం చేయాలని కోరారు.

అయోధ్య భూ వివాదానికి గత ఏడాది తెరపడిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో.. మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. హిందువులకు మందిరం, ముస్లింలకు మరో చోట 5 ఎకరాల భూమి కేటాయించాలని తీర్పునిచ్చింది. ఆ తర్వాత భూమి పూజ చేశారు. అయితే కరోనా వైరస్ విజృంభించడంతో భూమి పూజ కార్యక్రమం వాయిదాపడింది. ఆగస్ట్ నెలలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా క్రతువు చేశారు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications