ఆర్పీఐలో చేరిన ఐటం గర్ల్ రాఖీ సావంత్, థాకరేపై రెడీ
ముంబై: ప్రముఖ నటి, ఐటం గర్ల్ రాఖీ సావంత్ శనివారం రామదాస్ అథావలే సారథ్యంలోని ఆర్పీఐ(ఏ) పార్టీలో చేరారు. ఆమెను ఆర్పీఏ(ఏ) మహిళా విభాగం సారథిగా పార్టీ అధ్యక్షులు అథావలే ప్రకటించారు. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎంఎన్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజ్ థాకరే పైన పోటీ చేసేందుకు తాను వెనుకాడబోనని ఆమె ప్రకటించారు.
తాను అసలు ఎవరిని చూసి జడిసే ప్రసక్తి లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లోకసభ ఎన్నికలకు ముందు రాష్ట్రీయ ఆమ్ పార్టీ పేరుతో రాఖీ సావంత్ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఆమె ఘోర పరాజయం పాలయ్యారు. ఆమెకు 1995 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఆ ఎన్నికల్లో రాఖీ సావంత్ తాను స్థాపించిన రాష్ట్రీయ ఆమ్ పార్టీ తరఫున ఆమె ముంబై నార్త్ వెస్ట్ లోకసభ స్థానానికి పోటీ చేశారు. శివసేన పార్టీ సీనియర్ నేత గజానన్ చంద్రకాంత్ కీర్తికర్, కాంగ్రెస్ సీనియర్ నేత కామత్ గురుదాస్ వసంత్, మాయాంక్ రమేష్ (ఆమ్ ఆద్మీ పార్టీ)లు ఈ నియోజక వర్గం నుండి పోటీ చేశారు. అయితే రాఖీ సావంత్ ఓడిపోయారు. ఎన్నికల అనంతరం ఆమె తన పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆమె బిజెపిలో చేరుతారనే వార్తలు వచ్చాయి. కానీ ఇన్నాళ్లకు ఆమె ఆర్పీఐలో చేరారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications