పెళ్లి పేరుతో రేప్: నగలు దొచుకున్నాడు
మైసూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతి మీద అత్యాచారం చేసిన నిందితుడిని కర్ణాటకలోని మైసూరు జిల్లా, కేఆర్ పేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
పాండవపుర తాలుకా చిక్కాడే గ్రామంలో నివాసం ఉంటున్న రమేష్ (30) అనే వ్యక్తిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. కుందూరు గ్రామంలో 17 సంవత్సరాల బాలిక నివాసం ఉంటున్నది. నాలుగు నెలల క్రితం బాలిక మండ్యలోని ఆసుపత్రికి వెళ్లింది.
చికిత్స చేయించుకున్న తరువాత బస్సులో సొంత గ్రామానికి బయలుదేరింది. అదే బస్సులో ఉన్న రమేష్ బాలికను పరిచయం చేసుకున్నాడు. ఆమె మొబైల్ నెంబర్ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆమెతో టచ్ లో ఉన్నాడు.
తరువాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీసుకు వెళ్లి అత్యాచారం చేశాడు. ఆమె దగ్గర ఉన్న 50 గ్రాముల బంగారు నగలు లాక్కోని వెళ్లి కుదవ పెట్టి జల్సా చేశాడు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో రమేష్ ను అరెస్టు చేశామని కేఆర్ పేట పోలీసులు తెలిపారు.