భాగ్యనగరంలో భోజనం.. అమరావతిలో టీ: కోవింద్ రాకకై వేచిచూస్తున్న తెలుగు రాష్ట్రాలు
రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరఫున పోటీ పడుతున్న రామ్ నాథ్ కోవింద్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. వచ్చే వారంలో ఆయన హైదరాబాద్, విజయవాడల్లో పర్యటించనున్నారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరఫున పోటీ పడుతున్న రామ్ నాథ్ కోవింద్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. వచ్చే వారంలో ఆయన హైదరాబాద్, విజయవాడల్లో పర్యటించనున్నారు.
తనకు మద్దతు పలికిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ మంత్రులతో, ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన మంత్రులతో రామ్ నాథ్ కోవింద్ సమావేశమై కృతజ్ఞతలు తెలియజేయనున్నారు.

తన ప్రచారంలో భాగంగా హైదరాబాద్ కు రానున్న ఆయనకు ఘనమైన విందు భోజనాన్ని సిద్ధం చేయాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. రుచికరమైన ప్రత్యేక వంటకాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ లో భోజనం చేసే కోవింద్, ఆపై అమరావతిలో మాత్రం సాయంకాల అల్పాహార విందు, తేనీరు తీసుకోనున్నారు.
నిజానికి ఈ వారంలోనే ఆయన తెలుగు రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ కంటి శస్త్ర చికిత్స నిమిత్తం ఢిల్లీలో ఉండిపోయారు. అలాగే నెలాఖరులో జీఎస్టీ అమల్లోకి రానుండగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగే ఆ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనుండటంతో కోవింద్ పర్యటన వచ్చే వారానికి వాయిదా పడింది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications