కొత్త రూ.500, 2000 నోట్లకు ఎప్పుడు ఆమోదం లభించిందంటే..?
పెద్ద నోట్ల రద్దు అనంతరం చలామణిలోకి వచ్చిన కొత్త రూ. 500, 2000 నోట్ల డిజైన్పై భారత రిజర్వు బ్యాంక్ వివరణ ఇచ్చింది.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం చలామణిలోకి వచ్చిన కొత్త రూ. 500, 2000 నోట్ల డిజైన్పై భారత రిజర్వు బ్యాంక్ వివరణ ఇచ్చింది. సమాచారం హక్కు చట్టం ద్వారా జితేంద్ర ఘడ్డే అని వ్యక్తి ఈ మేరకు సమాచారం కోరగా.. గత సంవత్సరం మే నెలలోనే ఈ కొత్త నోట్లకు ఆమోదం తెలిపినట్లు ఆర్బీఐ తెలిపింది.
ఈ కొత్త నోట్ల డిజైన్ను గత మే 19న ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశంలో అనుమతితోపాటు ఆమోదం లభించిందని ఆర్బీఐ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ఈ డిజైన్ ను ఆమోదించిన ఆర్బీఐ గవర్నర్ పేరు వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు.

పారదర్శకత చట్టంలోని 8(1)(ఎ) సెక్షన్ ప్రకారం ఈ వివరాలు ఇవ్వలేమని ఆయన తెలిపారు. డిజైన్ ఆమోదంపై ఖచ్చితమైన తేదీ కావాలంటూ జితేందర్ ఆర్బీఐ ద్వారా ప్రశ్నించారు. ఈ అంశంలో కేంద్ర బ్యాంక్ మొదటి సమావేశం, ఎజెండా, డిజైన్ ఆమోదం, ప్రింటింగ్ కొరకు ఆదేశాలు తదితర అంశాలపై ఖచ్చితమైన సమాచారం కావాలని ఆయన కోరారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications