RBI: రూ. 2000 నోట్ల మార్పిడి గడువు పెంపు, ఎప్పటి వరకంటే?
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 2,000 డినామినేషన్ నోట్ల మార్పిడికి గడువును అక్టోబర్ 7, 2023 వరకు పొడిగించాలని నిర్ణయించింది. మే 19, 2023న తిరిగి చలామణి నుంచి రూ. 2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత తాజాగా, ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇంతకుముందు రూ. 2వేల నోట్ల మార్పిడికి గడువు సెప్టెంబర్ 30గా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, "సమీక్ష ఆధారంగా, రూ. 2000 నోట్ల డిపాజిట్/మార్పిడి కోసం ప్రస్తుత ఏర్పాటును అక్టోబర్ 07, 2023 వరకు పొడిగించాలని నిర్ణయించాం" అని ఆర్బిఐ తెలిపింది. అప్పటి వరకు
"రూ. 2000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయి" అని ఆర్బిఐ తెలిపింది.

మే 19 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లలో.. రూ. 3.42 లక్షల కోట్లు విజయవంతంగా బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు కేంద్ర బ్యాంక్ వెల్లడించింది. ఇవి సెప్టెంబర్ 29, 2023 నాటికి ఇప్పటికీ రూ. 0.14 లక్షల కోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి.
19 ఆర్బిఐ ఇష్యూ కార్యాలయాల్లో రూ. 2000 నోట్లను డిపాజిట్/మార్పిడి చేసుకునే సదుపాయం తదుపరి సలహా వరకు అందుబాటులో ఉంటుందని ఆర్బిఐ పేర్కొంది. ప్రజలు రూ. 2000 నోట్లను "ఇక ఎలాంటి ఆలస్యం లేకుండా" డిపాజిట్/మార్పిడి చేసుకోవాలని కోరింది.
అక్టోబర్ 8, 2023 పరిస్థితి ఏంటి
అక్టోబరు 8, 2023 నుంచి రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేసే లేదా మార్చుకునే విధానంలో మార్పు ఉంటుందని ఆర్బీఐ తెలిపింది .బ్యాంకు శాఖలు డిపాజిట్ లేదా మార్పిడి కోసం రూ.2,000 నోట్లను స్వీకరించడం మానేస్తాయి.వ్యక్తులు, సంస్థలు ఇప్పటికీ ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాల వద్ద రూ. 2,000 నోట్లను మార్చుకునే అవకాశం ఉంటుంది, ఒకేసారి రూ. 20,000 పరిమితి ఉంటుంది.

వ్యక్తులు, సంస్థలు భారతదేశంలోని వారి బ్యాంకు ఖాతాలకు మొత్తాన్ని జమ చేయడానికి 19 RBI ఇష్యూ కార్యాలయాల్లో రూ. 2,000 నోట్లను టెండర్ చేయవచ్చు. దేశంలోని వారు రూ. 2,000 నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా పంపవచ్చు, భారతదేశంలోని వారి బ్యాంక్ ఖాతాలకు క్రెడిట్ కోసం 19 ఆర్బీఐ కార్యాలయాలలో దేనినైనా చిరునామాకు పంపవచ్చు.
న్యాయస్థానాలు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు, ప్రభుత్వ విభాగాలు లేదా దర్యాప్తు ప్రక్రియలు లేదా ఎన్ఫోర్స్మెంట్లో పాల్గొన్న ఏదైనా ఇతర పబ్లిక్ అథారిటీ ఎటువంటి నిర్ధిష్ట పరిమితి లేకుండా 19 RBI ఇష్యూ కార్యాలయాలలో దేనినైనా రూ. 2,000 బ్యాంకు నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చవచ్చు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications