రిలయన్స్ జియోతో ఎస్బీఐ ఒప్పందం: వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు
ముంబై: రిలయన్స్ జియో, ఎస్బీఐల మధ్య కుదిరిన తాజా ఒప్పందంతో రెండు సంస్థల వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. డిజిటల్ చెల్లింపుల సేవలను మరింత మంది వినియోగదారులకు చేరువ చేసేందుకు రిలయన్స్ జియో-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లు చేతులు కలిపాయి. ఇందులో భాగంగా జియో పేమెంట్స్ బ్యాంకు ద్వారా ఎస్బీఐ డిజిటల్ కస్టమర్లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

జియోలో యోనో కూడా..
ఆర్ఐఎల్-ఎస్బీఐ 70:30 భాగస్వామ్యంతో పనిచేయనున్నాయి. ఇందులో భాగంగా ఎస్బీఐ అందించే ‘యోనో' ఫ్లాట్ ఫాం వేదికగా జియో మొబైల్లో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బీఎస్ఈ ఫైలింగ్ సందర్భంగా వెల్లడించింది. మై జియో యాప్ లో ఎస్బీఐ ‘యోనో'ను జోడించనున్నారు.

ఎస్బీఐ వినియోగదారులకూ జియో ప్రైమ్ ప్రయోజనాలు
దేశంలో అతిపెద్ద ఓవర్ ది టాప్(ఓటీటీ) మొబైల్ అప్లికేషన్స్లో ‘మై జియో' యాప్ ఒకటిగా ఉంది. ఇప్పుడు జియో-ఎస్బీఐ భాగస్వామ్యంతో ఆర్థిక సేవలను కూడా అందించనుంది. దీని ద్వారా అటు ఎస్బీఐ, ఇటు జియో వినియోగదారులిద్దరూ రిలయన్స్ జియో ప్రైమ్ ప్రయోజనాన్ని పొందనున్నారు.

ప్రత్యేక ధరలకే జియో ఫోన్లు..
ఇప్పటికే ఎస్బీఐ వినియోగదారులకు రివార్డు పాయింట్లు అందిస్తుండగా, ఇప్పుడు జియో భాగస్వామ్యంతో మరిన్ని రివార్డు పాయింట్లు వినియోగదారుల ఖాతాలో జమకానున్నాయి. అంతేగాక, ఎస్బీఐ ఖాతాదారులకు జియో ఫోన్లు ప్రత్యేక ధరకు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.

ఇరుపక్షాల వినియోగదారులకు లాభమే
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ.. అతిపెద్ద నెట్వర్క్ అయిన జియోతో చేతులు కలపడం ఆనందించదగ్గ విషయమని ఈ సందర్భంగా ఎస్బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. తాజా ఒప్పందం ద్వారా ఎస్బీఐ, జియో వినియోగదారులు మరింత లబ్ధి పొందే అవకాశం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ తెలిపారు. కాగా, 60-90రోజుల్లో ఈ ఉమ్మడి సేవలు అందుబాటులోకి రానున్నాయి.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications