రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణం: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీని అరెస్ట్ చేసిన సీబీఐ
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ తపస్ పాల్ ను సీబీఐ శుక్రవారం అరెస్ట్ చేసింది.
కోల్కతా : తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ తపస్ పాల్ ను సీబీఐ శుక్రవారం అరెస్ట్ చేసింది. రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణం కేసులో ఆయన్ను దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించిన తర్వాత సీబీఐ అధికారులు ఈ చర్య తీసుకున్నారు.
రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణం కేసు విచారణలో సీబీఐ సంధించిన ప్రశ్నలకు ఎంపీ తపస్ పాల్ ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడం వల్లే ఆయన్ని అరెస్ట్ చేసినట్లు సీబీఐ పేర్కొంది.

తపస్ పాల్ గతంలో ఈ రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కంపెనీకి డైరెక్టర్ గా పనిచేశారు. రూ.17 వేల కోట్ల రూపాయల మేరకు వేలాది మంది మడుపర్లను ఈ కంపెనీ మోసగించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కంపెనీ ద్వారా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ లబ్ది పొందినట్లు అనుమానం.
ఆ పార్టీకే చెందిన మరో నేత సుదీప్ బందోపాధ్యాయకు కూడా ఈ కేసులో సమన్లు జారీ అయ్యాయి. ఈ పరిణామాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications