రూ.2 వేల నోటు: ఆసక్తికర అంశం తెలిపిన కేంద్రం.. ఏంటంటే..
రూ.2వేల నోటుపై కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రూ.2వేల నోటు ఎందుకు ఎక్కువగా కనిపించడం లేదనే అంశంపై స్పష్టత ఇచ్చింది. 2 వేల నోటు ముద్రణ ఎందుకు తగ్గించారు.. ఎన్ని నోట్లు చెలామణిలో ఉన్నాయనే ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇచ్చింది. గత రెండేళ్లుగా రూ.2వేల నోటును ముద్రించడం లేదని లోక్సభలో వెల్లడించింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయం తెలియజేశారు.
2018, మార్చి 30 నాటికి మొత్తం 336.2 కోట్ల రూ.2000 నోట్లు చెలామణిలో ఉన్నాయని ఠాకూర్ చెప్పారు. 2021, ఫిబ్రవరి 26 నాటికి వీటి సంఖ్య 249.9 కోట్లకు తగ్గిందన్నారు. ప్రజల ఆర్థిక లావాదేవీల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐతో సంప్రదించి నోట్ల ముద్రణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అనురాగ్ ఠాకూర్ వివరించారు.

2019-20, 2020-21ల రూ.2000 నోటు ముద్రించ లేదని తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 354.2 కోట్ల రూ.2000 నోట్లను ముద్రించినట్లు 2019లో ఆర్బీఐ తెలిపింది. అధిక విలువ కలిగిన నోట్ల ముద్రణను తగ్గించి, తద్వారా బ్లాక్ మనీ అడ్డుకట్ట వేసే ఉద్దేశంతోనే వీటి ముద్రణను నిలిపివేసినట్లు తెలుస్తోంది. 2016లో నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం తొలిసారి రూ.2000 నోటును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications