కొత్త విదేశాంగ కార్యదర్శి: కాంగ్రెస్ విమర్శలు, రాజకీయ ఉద్దేశ్యం లేదని బీజేపీ
న్యూఢిల్లీ: గురువారం న్యూఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ కార్యాలయంలో నూతన కార్యదర్శిగా ఎస్. జైశంకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యాలే తన ప్రాధాన్యాలని నూతన విదేశాంగ కార్యదర్శి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంలో విదేశాంగ కార్యాలయంలోని ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్. జైశంకర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
అమెరికాలో భారత రాయబారిగా పనిచేస్తున్న ఎస్. జైశంకర్ను భారత విదేశాంగ కార్యదర్శిగా నియమించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన నియామకాలపై మంత్రివర్గ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆదేశాలు వచ్చిన వెంటనే, జై శంకర్ బాధ్యతలు స్వీకరించారు.
నిన్నటి వరకు విదేశాంగ కార్యదర్శిగా ఉన్న సుజాతా సింగ్ పదవీ కాలం ఇంకా 8 నెలలు మిగిలి ఉండగానే ఆమెను పదవి నుంచి తప్పించారు. భారత్లో అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన ముగిసిన తర్వాతి రోజే ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని, సుజాతా సింగ్ ఆ పదవి నుంచి అమార్యదగా తప్పించారని కాంగ్రెస్ పార్టీ లీడర్ మనిష్ తివారీ ట్విట్టర్లో మోడీ ప్రభుత్వంలో ఆరోపణలు చేశారు.
Is
sacking
of
Foreign
Secretary
late
retribution
for
her
stand
on
Devyani
Khorbode
affair?
Removal
after
a
Presidential
visit"coincidental"?
—
Manish
Tewari
(@ManishTewari)
January
29,
2015
కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఈ నియామకాల్లో రాజకీయ ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసింది. ఆగస్టు 2013లో విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సుజాతా సింగ్ ఈ ఏడాది ఆగస్టులో రిటైర్ కావాల్సి ఉంది.
ఇక జైశంకర్ 2004 నుంచి 2007 వరకు అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఉమ్మడి కార్యదర్శిగా అమెరికాతో చేసిన అణు ఒప్పందం చర్చల్లో కీలక పాత్ర పోషించారు.