Sabarimala:అయప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెబుతాం, సీఎం ఆలోచిస్తున్నారు, కేరళ మంత్రి సురేంద్రన్ క్లారిటీ
శబరిమల/ పతనంపట్టి/ కొచ్చి: శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. పశ్చిమ కనుమల్లోని పావన పంపా నదీ తీరాన శబరిగిరుల్లో కొలువైన అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ 5 వేల మందికి అవకాశం ఇచ్చే విషయంలో ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని, అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెబుతామని కేరళ దేవస్వం శాఖా మంత్రి కడకంపల్లి సురేంద్రన్ స్పష్టం చేశారు.
శబరిమలలో అయప్పస్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ 5 వేల మంది అయ్యప్ప భక్తులకు అవకాశం ఇవ్వాలని ఇటీవల శబరిమల ఆలయ కమిటీ బోర్డు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు మనవి చేసింది.

అయ్యప్ప భక్తుల సంఖ్య చాలా తగ్గింది
పశ్చిమ కనుమల్లోని పావన పంపా నదీ తీరాన శబరిగిరుల్లో కొలువైన అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య ప్రతిఏడాది పెరుగుతూనే ఉంటుంది, అయితే ప్రస్తుత కరోనా వైరస్ దెబ్బకు అయ్యప్ప భక్తుల సంఖ్య చాలా తగ్గిపోయింది. కేరళ ప్రభుత్వం COVID-19 నియమ నిబంధనలు అంటూ అయ్యప్ప భక్తులకు అనేక నియమాలు విధించడం భక్తుల సంఖ్య తగ్గిపోవడానికి మరో ప్రధాన కారణం అయ్యింది.

ఇంత తక్కువ మందికి అవకాశమా!
కరోనా వైరస్ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు వెయ్యి మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి అనుమతి ఇస్తున్నారు. శనివారం, ఆదివారం రోజుల్లో రెండు వేల మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ఆలయ కమిటి నిర్వహకులు, కేరళ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అయితే గతంలో ప్రతిరోజు వేల సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకుని స్వామివారిని దర్శించుకునే వాళ్లు.

అవకాశం ఇవ్వండి
శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు గతంలో ఉన్న నియమాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. కరోనా వైరస్ మహమ్మారి వ్యాపించుకుండా కేరళ ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. మండలపూజ, మకరవిలక్కం సీజన్ ప్రారంభం అయిన సందర్బంగా పరిమితి సంఖ్యలో శబరిమలలోకి అయ్యప్పస్వామి భక్తులను అనుమతి ఇస్తున్నారు. ఎకువ మంది అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఇవ్వాలని, అందుకు తగ్గట్లు తాము ఏర్పాట్లు చేశామని శబరిమల దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్. వాసు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు మనవి చేశారు.

భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాము
అయ్యప్ప భక్తులకు నీలక్కల్, పంపా, శబరిమలలోని అయ్యప్పస్వామి సన్నిధానంలో అయ్యప్ప భక్తులు బస చెయ్యడానికి ఎక్కువ అవకాశం ఉందని శబరిమల అయ్యప్పస్వామి బోర్డు కమిటీ అంటోంది. అయ్యప్ప భక్తులకు వైద్యసేవలు అందించడానికి నీలక్కల్, పంపా, సన్నిధానంలో అన్ని ఏర్పాట్లు చేశామని, ఐపీయూ, ఫార్మసీ, వెంటిలేటర్, ఆర్థో, కార్డియాలజీ తదితర సేవలు, సదుపాయాలు అన్నీ ఉన్నాయని, అందువలన అయ్యప్పభక్తులు ప్రతిరోజు 5 వేల మంది స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఇవ్వాలని దేవస్థానం బోర్డు అధ్యక్షుడు వాసు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు మనవి చేశారు.
Recommended Video

కేరళ మంత్రి క్లారిటి
శబరిగిరుల్లో కొలువైన అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ 5 వేల మందికి అవకాశం ఇచ్చే విషయంలో ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కేరళ దేవస్వం శాఖా మంత్రి కడకంపల్లి సురేంద్రన్ స్పష్టం చేశారు. ఇప్పటికే దేవస్వం బోర్డు కమిటీ సభ్యులు ప్రభుత్వానికి చేసిన మనవి పరిశీలనలో ఉందని, ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటారని మంత్రి కడకంపల్లి సురేంద్రన్ స్థానిక మీడియాకు చెప్పారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications