కొడుకుతో ఆడుకుంటావా! మనవడితోనా?: డిగ్గీపై సాధ్వి
గోరఖ్పూర్: వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే.. భారతీయ జనతా పార్టీ మహిళా నేత సాధ్వి ప్రాచీ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను విమర్శిస్తూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ పెళ్లి విషయంలోనూ ఆమె ఎద్దేవా చేశారు. ఆయన ఇటీవల అమృతా సింగ్ అనే మహిళను వివాహమాడిన సంగతి తెలిసిందే.

‘ఈ వయసులో పెళ్లి చేసుకున్నారు.. కొడుకుతో ఆడుకుంటారా... మనవళ్లతో ఆడుకుంటారా..' అంటూ సాధ్వి ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయాలకు పనికిరారని.. అది ఆయన తల్లి సోనియాగాంధీకి తెలుసునని, అందుకే రాహుల్ని బిహార్ ఎన్నికల సమయంలో అమెరికా పర్యటనకు పంపారని ఆమె విమర్శించారు.
బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పైనా విమర్శలు గుప్పించారు. గడ్డి తిని లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకెళ్లారని, ఆ సమయంలో ఆయన భార్య ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. అలాంటి వ్యక్తి మాటలను బీహార్ ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.
-
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
లడ్డూ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్, ఇక నెక్స్ట్..!! -
30ఏళ్ళ తర్వాత బుధుడి నక్షతంలోకి శనిదేవుడు.. వీరికి సంతోషాల బొనాంజా! -
కుప్పకూలిన రూపాయి: డాలర్ తో పోల్చుకుంటే..!! -
రేవంత్ రాజ్యసభ ఛాయిస్ 'ఆయనే', కొత్త పేరుతో ఖర్గే బ్రేక్ - రాహుల్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications