సీజేఐపై ఆరోపణలు చేసిన మహిళకు సుప్రీం నోటీసులు
ఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై జస్టిస్ ఎస్ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ ప్రక్రియ ప్రారంభించింది. ఆరోపణలు చేసిన మహిళలకు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగి అయిన ఆమెను ఏప్రిల్ 26న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
సీజేఐపై కుట్ర కేసులో న్యాయ విచారణ జరగాల్సిందే..
ఏప్రిల్ 26న కేసు విచారణ ప్రారంభిస్తామని జస్టిస్ ఎస్ఎ బోబ్జే, జస్టిస్ రమణ, జస్టిస్ ఇంద్రా బెనర్జీతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇతర మెటీరియల్కు సిద్ధంగా ఉండాలని కోర్టు సెక్రటరీ జనరల్కు సూచించింది.
కేసు విచారణ ఇన్ హౌస్ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇరు పార్టీల అడ్వకేట్ల కోసం వేచిచూసే ప్రసక్తే ఉండదని తేల్చి చెప్పింది. ఇది సాధారణ న్యాయ ప్రక్రియ కాదన్న బోబ్డే కేసు విచారణ పూర్తి చేసేందుకు నిర్దిష్ఠ గడువంటూలేదని చెప్పారు. ఎంక్వైరీ విధానాన్ని ఫలితాన్ని రహస్యంగా ఉంచుతామని అన్నారు.