సరిహద్దుల్లో పాకిస్తాన్ వికృత క్రీడ: స్కూల్లో చిక్కుకున్న పిల్లలు
సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి హద్దు మీరింది. పాక్ సైన్యం వికృత చర్యలకు పాల్పడుతోంది. మంగళవారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి హద్దు మీరింది. పాక్ సైన్యం వికృత చర్యలకు పాల్పడుతోంది. మంగళవారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
సరిహద్దు గ్రామాల్లో అలజడి సృష్టించింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రాజౌరి, పూంఛ్ సెక్టార్లలో మోర్టార్ షెల్స్ ప్రయోగిస్తూ వరుస కాల్పులకు తెగబడింది.
సరిహద్దుల్లో దాదాపు పన్నెండు పాఠశాలల్లో విద్యార్థులు చిక్కుకుపోయారు. నౌషోరా ప్రాంతంలో రెండు ప్రభుత్వ పాఠశాలల్లోను విద్యార్థులు లోపలే ఉండిపోయారు. వారిని మన సైన్యం రక్షించే ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే మంగళవారం ఉదయం ఓ జవాను సహా అభం శుభం తెలియని ఓ బాలికను పాకిస్తాన్ సైన్యం పొట్టన బెట్టుకుంది. పాక్ వికృత క్రీడ దృష్ట్యా ఎవరూ బయటకు రావొద్దని అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు.
అమర్నాథ్ యాత్రికుల ఉగ్రదాడి నిందితుల హతం
కాగా, ఇటీవల అమర్నాథ్ యాత్ర సందర్భంగా ఓ బస్సుపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.












Click it and Unblock the Notifications