విద్యార్థినితో గార్డెనర్ అసభ్యంగా.., ప్రియురాలి కూతురిపై రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఓ ప్రయివేటు పాఠశాలలో ఏడేళ్ల బాలిక పైన గార్డెనర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడు 50 ఏళ్ల వ్యక్తి. అతనిని శంకర్ లాల్గా గుర్తించి, పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపన సమాచారం మేరకు.. ఆనంద్ ప్రభాత్ ప్రాంతంలో ఓ ప్రయివేటు పాఠశాలలో ఇది జరిగింది.
గార్డెనర్ దాదాపు నెల రోజుల నుండి బాలికను వేధిస్తున్నాడు. పాఠశాల సమయం పూర్తయ్యాక ఆమె ఇంటికి వెళ్లే సమయంలో ప్రతి రోజు ఆమెను వాష్ రూంకు తీసుకు వెళ్లి, ఎక్కడెక్కడో ముట్టుకునేవాడు. ఆమె తల్లిదండ్రులు బాలికను తీసుకు వెళ్లేందుకు ఆలస్యంగా వచ్చేవారు. దీంతో అతను అలాంటి చర్యకు పూనుకునేందుకు సమయం చిక్కింది.
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కత్తెరతో పొడుస్తానని బెదిరించవాడు. అతను అలా భయపెట్టడంతో బాలిక కొద్ది రోజుల తర్వాత పాఠశాలకు వెళ్లడం మానేసింది. తల్లిదండ్రులు గుచ్చి గుచ్చి అడగటంతో ఆమె అసలు విషయం చెప్పింది. నిందితుడి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రియురాలి కూతురిపై అత్యాచారం
తమిళనాడులో ఓ వ్యక్తి తన ప్రియురాలి కూతురు పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పైన పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నైలోని నీలంగరాయ్ పోలీసు స్టేషన్ పరిధిలో 18 ఏళ్ల కళాశాల విద్యార్థిని పైన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రియుడితో కలిసి ఉన్న ఓ యువతిని పోలీసు కానిస్టేబుల్ అవతారమెత్తి బెదిరించి ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అతను విచారణ పేరిట తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.