మరో ఘోరం: స్కూటీపై వెళ్తున్న దంపతులను కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లారు, మృతి
రాయ్పూర్: ఢిల్లీలోని ఓ యువతిని కారు ఈడ్చుకెళ్లిన ఘటన మరువకముందే.. అలాంటి ఘటనే మరొకటి జరిగింది. స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలను ఓ కారు ఢీట్టింది. ఆ తర్వాత 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంతో దంపతులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గ్ పోల్సాయిపరా నివాసి జ్ఞాన్చంద్ లేఖానీ (56) తన భార్య వందనా లేఖానీ (45 ఏళ్లు)తో కలిసి స్కూటీలో రాజ్నంద్గావ్కు వెళ్లారు. అక్కడ అతను తన పరిచయస్తుల స్థలంలో ఒక సంగీత కచేరీలో పాల్గొన్నారు. భార్యాభర్తలిద్దరూ రాజ్నంద్గావ్ నుంచి కోటవైపు వస్తున్నారు.

ఆ మధ్యాహ్నం 12.30 గంటలకు శివనాథ్ ఓవర్ బ్రిడ్జిపైకి రాగానే ముందు నుంచి కారు ఢీకొట్టింది. కారు వేగంగా ఢీకొనడంతో భార్యాభర్తలిద్దరూ దాదాపు 300 మీటర్లు ఈడ్చుకెళ్లి వంతెన పక్క గోడను ఢీకొట్టారు.
ఘటన అనంతరం కారులో ఉన్నవారు కారు వదిలి పారిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పుల్గావ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన జంటను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారిద్దరూ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications