కేజ్రీవాల్కు భారీ షాక్
మరో ఐదు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు భారీ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని శ్రమిస్తున్న తరుణంలో ఏకంగా ఏడుగురు ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్బై చెప్పారు. పార్టీలో తమ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అరవింద్ కేజ్రీవాల్ పైనా, ఆప్ పార్టీపైనా విశ్వాసం కోల్పోయినట్లు ఎమ్మెల్యేలు భావనా గౌర్, మదన్ లాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు రాజీనామా లేఖలు పంపారు. మీ పట్ల, పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయానని.. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన లేఖలో భావనా గౌర్ పేర్కొన్నారు. దయచేసి తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.

త్రిలోక్పురి ఎమ్మెల్యే రోహిత్ మెహ్రౌలియా, జనక్పురి ఎమ్మెల్యే రాజేశ్ రిషి, కస్తూర్బానగర్ ఎమ్మెల్యే మదన్ లాల్, మెహ్రౌలి ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ తోపాటు ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ, బిజ్వాసన్ ఎమ్మెల్యే బీఎస్ జూన్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. అయితే, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు ఈసారి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం గమనార్హం. ఈ క్రమంలో వీరంతా ఆప్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేకపోలేదు. దీంతో ఆ పార్టీకి భారీ నష్టమే కలిగించే అవకాశం ఉంది.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి అధికారం దక్కించుకునేందుకు బీజేపీ అగ్రనేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోడీతోపాటు కేంద్రమంత్రులు, రాష్ట్ర నేతలు ప్రజల వద్దకు వెళ్లి ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనుండగా.. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి. మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా శ్రమిస్తుండగా.. ఈసారి దేశ రాజధానిలో జెండా ఎగురేయాలని బీజేపీ కూడా ఉధృతంగా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ కూడా బరిలో ఉన్నప్పటికీ.. ఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications