వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సునంద పుష్కర్ కేసులో సాక్షాలు నాశనం చేశారు, సీబీఐతో: బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి !

సునంద పుష్కర్ మృతి కేసులో సాక్షాలు నాశనం చేశారు సునంద భర్త శశి థరూర్ అన్నీ అపద్దాలు చెప్పాడు విచారణ పేరుతో పోలీసులు ఆట్లాడుతున్నారు, స్వామి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శశి తరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో విచారణ సక్రమంగా జరగడం లేదని, అధికారులు విచారణ పేరుతో ఆట్లాడుతున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు.

కేసు విచారణ సవ్యంగా చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని చెప్పారు. సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ విచారణ చేస్తున్న అధికారులు ముందు అన్నీ అపద్దాలు చెప్పారని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు.

Shashi lied evidences tampered Sunanda death case: Subramanian Swamy

ఇప్పటికే సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో సాక్షాలు మొత్తం నాశనం చేసినా ఢిల్లీ పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఓ అనుమానాస్పద మృతి కేసు విచారణ చెయ్యడానికి ఢిల్లీ పోలీసులకు మూడు సంవత్సరాలు సమయం కావాలా అని సూటిగా ప్రశ్నించారు.

కేసు విచారణ అధికారులను తప్పించి మరో సీనియర్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సునంద పుష్కర్ కేసును విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అంతేకంటే సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసు సీబీఐకి అప్పగిస్తే ఇంకా మంచిదని రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు.

English summary
BJP leader Subramanian swamy has alleged that Delhi police has failed investigate the mistery of Sunanda Pushkar death. He also alleged that Sunanda's husband Shashi Tharoor lied in the case and the evidences were tampered. After 3 years of investigation the police came up with no result. This case should be investigated by CBI, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X