సునంద పుష్కర్ మృతి కేసు: ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు శశిథరూర్
ఢిల్లీ: తన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో తన అరెస్టుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ మంగళవారం కోర్టుకు వెళ్లారు. తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
Recommended Video
ఈ మేరకు ఢిల్లీ కోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఢిల్లీ కోర్టు శశిథరూర్ను నిందితుడిగా గుర్తిస్తూ జూలై 7న విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. అయితే తనపై ఆరోపణలు నిరాధారమైనవిగా, సునంద పుష్కర్ మృతితో తనకు సంబంధం లేదని శశథరూర్ అంటున్నారు.
ఢిల్లీ పోలీసులు సమర్పించిన 3000 పేజీల ఛార్జీషీటులో సునంద పుష్కర్ హత్య కేసులో ఆయన ప్రమేయం ఉందని చెబుతూ ఆయనను నిందితుడిగా పేర్కొన్నారు. భార్య పట్ల థరూర్ క్రూరంగా వ్యవహరించారని ఆరోపించారు. 2014 జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్లో సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.