అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించలేకపోయాడు: మోడీపై శివసేన
ప్రధాని నరేంద్ర మోడీని శివసేన అలెగ్జాండర్, నెపోలియన్తో పోల్చింది. ఆ పార్టీ అధికార పత్రిక సామ్నా ఎడిటోరియల్లో సోమవారం ఈమేరకు వ్యాఖ్యానించింది.
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీని శివసేన అలెగ్జాండర్, నెపోలియన్తో పోల్చింది. ఆ పార్టీ అధికార పత్రిక సామ్నా ఎడిటోరియల్లో సోమవారం ఈమేరకు వ్యాఖ్యానించింది.
మోడీ పాలనను అలెగ్జాండర్, నెపోలియన్తో పోల్చింది. అయితే స్వర్ణ యుగం ఒక పార్టీకే పరిమితం కాకూడదని దేశం మొత్తానికి వర్తించాలని శివసేన పేర్కొంది.
ది గ్రేట్ అలెగ్జాండర్, నెపోలియన్ తమ రాజకీయ జీవితంలో ప్రంపచాన్ని జయించలేకపోయారని గుర్తు చేసింది. జమ్మూ కాశ్మీర్లోని పీడీపీ-బీజేపీ ప్రభుత్వం వైఫల్యాలను శివసేన తప్పుపట్టింది.
శ్రీనగర్ ఉపఎన్నిక సందర్భంగా ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పడం, హింసాత్మక సంఘటనలు, తక్కువ పోలింగ్ శాతం, ఆర్మీ జవాన్లపై స్థానికుల దాడి వంటి సంఘటలను సామ్నా ఎత్తి చూపింది.
అదే సమయంలో, చివరలో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను శివసేన పొగడ్తలతో ముంచెత్తింది. వారిద్దరు చిత్తశుద్ధి, కఠిన శ్రమతో అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించడం మంచి పరిణామంతో పాటు ప్రేరణ కలిగిస్తోందని సామ్నా కొనియాడింది.