సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ కు షాక్ ఇచ్చిన మాజీ సీఎం సిద్దూ, ఇంటికి వెళ్లి పిలిచినా !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సంకీర్ణ ప్రభుత్వం సమన్వయ కమిటి అధ్యక్షుడు సిద్దరామయ్య మరోసారి ఝలక్ ఇచ్చారు. సీఎం కుమారస్వామి కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామి నామినేషన్ సమర్పించే సమయంలో తాను హాజరుకాలేనని సిద్దరామయ్య మీడియాకు చెప్పారు.
నిఖిల్ కుమారస్వామి తల్లి, రామనగర ఎమ్మెల్యే అనితా కుమారస్వామి తన ఇంటికి వచ్చి తన కుమారుడు మండ్య లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసే సమయంలో మీరు హాజరుకావాలని మనవి చేశారని సిద్దరామయ్య అన్నారు.

అయితే నిఖిల్ కుమారస్వామి నామినేషన్ సమర్పించే సమయంతో తాను హాజరుకాలేనని అనితా కుమారస్వామికి చెప్పానని సిద్దరామాయ్య అన్నారు. మార్చి 25వ తేదీ సోమవారం నిఖిల్ కుమారస్వామి మండ్య లోక్ సభ నియోజక వర్గంలో పోటీ చెయ్యడానికి నామినేషన్ వేస్తున్నారని సిద్దరామయ్య అన్నారు.
అదే రోజు తనకు మైసూరులో చాల కార్యక్రమాలు ఉన్నాయని, అక్కడి నుంచి చిత్రదుర్గకు వెలుతున్నానని, అందువలన నిఖిల్ కుమారస్వామి నామినేషన్ వేసే సమయంలో తాను హాజరుకాలేనని అనితా కుమారస్వామికి చెప్పానని సిద్దరామయ్య అన్నారు.
అదే రోజు కర్ణాటకలోని వివిద లోక్ సభ నియోజక వర్గాల్లో పోటీ చెయ్యడానికి నాయకులు నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్నారని, అన్ని కార్యక్రమాలకు తాను హాజరుకావడం సాధ్యం కాదని సిద్దరామయ్య చెప్పారు. తుమకూరు లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ నామినేషన్ వేస్తున్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. 20 లోక్ సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్, 8 లోక్ సభ నియోజక వర్గాల్లో జేడీఎస్ పార్టీలు పొటీ చేస్తున్నాయి.
-
హోలీ ఎప్పుడు? మార్చి 3 లేదా 4నా - స్కూల్స్.. బ్యాంకుల సెలవుపై తాజా నిర్ణయం..!! -
దుబాయ్, అబుదాబీలో భారతీయులకు గుడ్ న్యూస్..! -
కీలక మలుపు తిరిగిన ఇరాన్ యుద్ధం.. చైనా ఎంట్రీ! -
మెగాస్టార్ సినిమాలో విలన్ గా మోహన్ బాబు..! -
సడన్ గా లబ్దిదారుల అకౌంట్ లో రూ.2,000 జమ: పింఛన్ + బోనస్ -
రేషన్ కార్డు దారులకు ఏపీ ప్రభుత్వం బిగ్ ఆఫర్ - ఇక ప్రతీ కుటుంబానికీ..!! -
చంద్రగ్రహణం కారణంగా కలిసొచ్చే రాశులు, కష్టాలొచ్చే రాశులు ఇవే! -
వారి రేషన్ కార్డులు రద్దు, జాబితా సిద్దం - అనూహ్య నిర్ణయం..!! -
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, వారికి కేటాయింపు - పంపిణీ ముహూర్తం..!! -
పాకిస్థాన్ షాకింగ్ నిర్ణయం.. మార్చి 31 వరకు.. -
దుబాయ్ లో ఇరుక్కుపోయిన తెలంగాణా మంత్రి.. పరిస్థితి ఇలా! -
నేడే చంద్ర గ్రహణం- తెరచి వుండే ఆలయాలు ఇవే












Click it and Unblock the Notifications