Singer: నాలుగు రాష్ట్రాలు, ఆరు మంది భార్యలు, ఈ సింగర్ పోటుగాడు, పైగా సిద్దాంతాలు, ఎలా చేశాడంటే ?
పాట్నా/ రాంఛీ/న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కాపురం చేశాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మనోడు ఆర్క్రెస్టాలో పాటలుపాడుతున్నాడు. గత ఏడాది మెడికల్ షాపులో మందులు కొనుక్కొని వస్తానని ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తరువాత మాయం అయ్యాడు. అతని కోసం కుటుంబ సభ్యులు గాలిస్తూనే ఉన్నారు. ఇటీవల భార్య సోదరుడు వేరే రాష్ట్రంలో రైలు ఎక్కడానికి వెళ్లాడు. అదే రైల్వేస్టేషన్ లో మాయం అయిన బావ మరో మహిళతో పాటు కనపడ్డాడు. సీన్ కట్ చేస్తే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కేసు పెట్టిన భార్యకు ఆమె భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని మాత్రమే తెలిసింది. అయితే పోలీసుల విచారణలో అతను నాలుగు రాష్ట్రాల్లో ఆరు మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడని వెలుగు చూడటంతో అందరూ బిత్తరపోయారు.
Wife: వయసులో 16 ఏళ్లు తేడా, నా భార్యను నేను సుఖపెట్టలేదా ?, అక్రమ సంబంధం ఉందని పాన్ తో ?
భార్య, పిల్లలు
బీహార్ లోని జవదారి అనే ఊరిలో మంజుల అనే మహిళ నివాసం ఉంటున్నది. 2018లో కుటుంబ సభ్యులు సెట్ చేసిన చోటు కుమార్ అలియాస్ కుమార్ అనే యువకుడిని మంజుల పెళ్లి చేసుకుంది. మంజులతో కుమార్ సంతోషంగా కాపురం చేశాడు. కుమార్, మంజుల దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
భర్త జంప్ జిలాని
చోటు కుమార్ ఆర్క్రైస్టాల్లో పాటలు పాడుతుంటాడు. ఎక్కడ సంగీత కచేరి జరిగినా అక్కడికి వెలుతున్న చోటు కుమార్ పాటలు పాడి పలువురిని ఆకర్షిస్తున్నాడు. 18 నెలల క్రితం మెడికల్ షాపులో మందులు కొనుక్కొని వస్తానని ఇంటి నుంచి వెళ్లిన చోటు కుమార్ తరువాత మాయం అయ్యాడు. చోటు కుమార్ కోసం అతని భార్య మంజుల కుటుంబ సభ్యులు ఇంతకాలం గాలిస్తూనే ఉన్నారు.
బావ మరిది చూసి షాక్
మంజులకు వికాస్ చోటూ అనే సోదరుడు ఉన్నాడు. కోల్ కత్తా వెళ్లడానికి వికాస్ చోటు జుమాయి రైల్వేస్టేషన్ దగ్గరకు వెళ్లాడు. రైల్వే స్టేషన్ లో మంజుల భర్త చోటు కుమార్ మరో మహిళతో కలిసి వికాస్ చోటుకు కనిపించాడు. వికాస్ చోటు అక్కడికి వెళ్లే సరికి అతని బావ చోటు కుమార్ అతని వెంట ఉన్న మహిళతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
పోలీసుల పంచాయితీలు
వికాస్ చోటు వెంటనే అతని సోదరి మంజులకు ఫోన్ చేసి మ్యాటర్ చెప్పాడు. మంజుల పోలీసు కేసు పెట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు రైల్వేస్టేషన్ లోని సీసీటీవీ కెమెరాలు, రైలు రిజర్వేషన్ టిక్కెట్ల వివరాలు సేకరించి చివరికి జార్ఖండ్ లో చోటు కుమార్ ను పట్టుకున్నారు. 2015లో జార్ఖండ్ మహిళను పెళ్లి చేసుకున్న చోటు కుమార్ కు 4 పిల్లలు ఉన్నారని వెలుగు చూడటంతో అతని భార్య మంజుల హడలిపోయింది.
పవర్ ఫుల్ పోటుగాడు
చోటు కుమార్ మీద కేసు పెట్టిన అతని భార్య మంజులకు తన భర్త చోటు కుమార్ రెండో పెళ్లి చేసుకున్నాడని మాత్రమే తెలిసింది. అయితే పోలీసుల విచారణలో చోటు కుమార్ అతను నాలుగు రాష్ట్రాల్లో ఆరు మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడని వెలుగు చూడటంతో అందరూ బిత్తరపోయారు.
నాలుగు రాష్ట్రాలు.... ఆరు మంది భార్యలు
ఆర్క్రైస్టాలో పాటలు పాడటానికి చోటు కుమార్ సినావరియా, సుందర్ ఖండ్, రాంఛీ, సంగ్రామ్ పూర్, ఢిల్లీ, దేవగర్ ఏరియాలకు వెళ్లి వచ్చాడని, అక్కడ అమ్మాయిలను ఆకర్షించి వారిని ప్రేమిస్తాడని, తరువాత వారితో నమ్మకంగా ఉంటూ పెళ్లి చేసుకున్నాడని బీహార్ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
సిద్దాంతం పెట్టుకున్న చోటు
అయితే మరో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన తరువాత చోటు కుమార్ ఏ భార్యతో కాపురం చేస్తుంటే ఆ భార్యకు పూర్తిగా దూరం అయిపోతాడని, తరువాత అటువైపు కన్నెత్తికూడా చూడడని, ఇతను ఆ సిద్దాంతాలు పాటించాడని పోలీసులు అన్నారు. ఇప్పటి వరకు చోటు కుమార్ మీద మంజు మాత్రమే కేసు పెట్టిందని, మిగిలిన ఐదు మంది భార్యలు అతని మీద కేసు పెట్టలేదని, కేసు పెడితే విచారణ చేస్తామని పోలీసులు అంటున్నారు.