ఇన్ఫోసిస్ లేడీ టెక్కీ స్వాతి దారుణ హత్య కేసు క్లోజ్
చెన్నై: ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న మహిళా టెక్కీ స్వాతి (25) హత్య కేసును న్యాయస్థానం పూర్తిగా క్లోజ్ చేసింది. హత్య చేసిన నిందితుడు ప్రాణాలతో లేనందున ఇక ఈ కేసు విచారణ చేసినా ప్రయోజనం లేదని పోలీసులు నివేదిక సమర్పించారు.
చెన్నైలోని సూలైమేడు ప్రాంతంలోని గంగై వీధిలో నివాసం ఉంటున్న స్వాతి ఇన్ఫోసిస్ లో ఉద్యోగిని. ఎప్పటిలాగే ఆమె తండ్రి 2016 ఆగస్టు 5వ తేదిన ఉదయం 7 గంటలకు స్వాతిని బైక్ లో తీసుకువచ్చి నుంగంబాకమ్ రైల్వే స్టేషన్ దగ్గర వదిలిపెట్టి వెళ్లారు.

ఉద్యోగానికి వెళ్లడానికి రైలు కోసం ఎదురు చూస్తున్న స్వాతిని రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫాం మీద కత్తితో అతి దారుణంగా దాడి చేసి హత్య చేసి పరారైనాడు. ఈ కేసులో పోలీసులు నెలై జిల్లా మీనాక్షిపురం ప్రాంతానికి చెందిన రాంకుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపించి విచారణ చేపట్టారు.
అయితే జైలులో ఉన్న రాంకుమార్ విద్యుత్ తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి కేసు విచారణలోనే ఉంది. తమిళనాడులో సంచలనం రేపిన స్వాతి హత్య కేసులో నిందితుడు రాంకుమార్ ప్రాణాలతో లేనికారణంగా కేసు మూసివేస్తున్నామని మంగళవారం ఎగ్మూరు కోర్టు తీర్పు చెప్పింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications