UP polls: ప్రతినెలా లీటర్ పెట్రోల్ ఫ్రీ, రైతులు, మహిళలకు వరాలు, అఖిలేష్ ఎస్పీ మేనిఫెస్టో ఇదే
లక్నో: మరికొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్న క్రమంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తమ పార్టీ మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేశారు. సమాజ్వాదీ 'వచన పత్రం'ను విడుదల చేస్తూ.. సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తే 15 రోజుల్లో రాష్ట్రంలోని చెరుకు రైతులకు పరిహారం అందజేస్తానని అఖిలేష్ హామీ ఇచ్చారు. అటువంటి రైతులకు చెల్లించేందుకు అవసరమైతే కార్పస్ ఫండ్ కూడా సిద్ధం చేస్తామని చెప్పారు.

ప్రతినెలా లీటర్ పెట్రోల్ ఉచితం.. రైతు కుటుంబాలకు 25 లక్షలు
రైతు పోరాటాల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని, రాష్ట్రంలో రైతు స్మారక చిహ్నం కూడా నిర్మిస్తామని అఖిలేష్ చెప్పారు. రాష్ట్రంలోని ద్విచక్ర వాహనదారులందరికీ ప్రతి నెలా ఒక లీటర్ ఉచిత పెట్రోల్ను అందజేస్తామని అఖిలేష్ ఒక ప్రత్యేక ప్రకటనలో తెలిపారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ విడుదల చేసిన మేనిఫెస్టోను 'సమాజ్వాదీ వచన్ పాత్ర' అని ట్యాగ్లైన్తో పిలుస్తున్నారు-- 'సత్య వచన్, అటూట్ వాద'. వచ్చే నాలుగేళ్లలో (2025 నాటికి) రైతులందరినీ 'రుణరహితం' చేస్తామని, చాలా మంది పేద రైతులకు ప్రయోజనం చేకూర్చే 'క్రిన్ ముక్తి' చట్టం రూపొందిస్తామని చెప్పారు అఖిలేష్ యాదవ్.

ఎంఎస్పీ, ఉపాధి హామీ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
రైతులకు అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఇస్తామని అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులందరికీ సాగునీటికి ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాలు, బీమా, పింఛన్ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అంతేగాక, ఎస్పీ మ్యానిఫెస్టో MGNREGA తరహాలో పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రవేశపెడుతుందని, పోలీసు శాఖతో సహా ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
Recommended Video
ఇంటర్ బాలికలకు రూ. 36వేలు
12వ తరగతి బోర్డు పరీక్షలో ఉత్తీర్ణులైన బాలికలకు రూ. 36,000 ఒకేసారి చెల్లించే ‘కన్యా విద్యా ధన్' పథకాన్ని ప్రారంభించడంతో పాటు ప్రాథమిక తరగతుల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు బాలికలకు ఉచిత విద్యను అందించనున్నట్లు ఎస్పీ చీఫ్ తెలిపారు. అదనంగా, సమాజ్ వాదీ పెన్షన్ పథకం కూడా ప్రారంభించబడుతుంది, దీని కింద వృద్ధులు, ముఖ్యంగా పేదరికం కంటే దిగువన ఉన్న (BPL) వర్గంలోని మహిళలు, కుటుంబాలకు ప్రతి సంవత్సరం రూ. 18,000 ఇస్తామని ప్రకటించారు. కాగా, .ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 10న తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి.
-
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..!












Click it and Unblock the Notifications