కలకలం రేపిన రోడ్డుపై రూ. 500 నోట్లు: కరోనా వ్యాప్తి కోసమేనా? ఏం జరిగింది?
లక్నో: సాధారణంగా రోడ్డుపై రూ. 500 పడితే ఏం చేస్తారు. అటూ ఇటూ చూసి జేబులో వేసుకుంటారు. లేదంటే ఆ డబ్బు ఎవరిదోనని ఆరా తీసి వారికి చెందేలా చేస్తారు. అయితే ఇప్పుడున్న పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. రోడ్డుపై రూ. 500 నోట్లు పడివున్నప్పటికీ ఎవరూ ముట్టుకోకపోవడం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

రూ. 500 నోట్లను చూసి భయపడిపోయారు..
వివరాల్లోకి వెళితే.. లక్నోలోని పేపర్ మిల్ కాలనీలోని రహదారిపై గురువారం రాత్రి రెండు రూ. 500 నోట్లు కనిపించాయి. అయితే, అటువైపు వెళ్లేవారు మాత్రం ఆ డబ్బులను ముట్టుకునేందుకు కూడా భయపడిపోయారు. వాటిని చూసి ఆందోళనకు గురయ్యారు.

అటు పోలీసులకు.. ఇటు వైద్యులకు సమాచారం..
అంతేగాక, కరోనావైరస్ వ్యాప్తి చేయడానికే ఎవరో వాటిని ఇక్కడ పడేశారన్న అనుమానంతో ఆ నోట్ల వైపు వెళ్లలేదు. ఇంకేవరినీ కూడా అటువైపు వెళ్లనీయలేదు. అంతటితో ఆగకుండా పోలీసు హెల్ప్ లైన్కు ఫోన్ చేసి ఈ నోట్లకు సంబంధించిన సమాచారాన్ని అందించారు. స్థానికంగా ఉన్న డాక్టర్లను కూడా సంప్రదించారు. దీంతో సదరు వైద్యులు 24 గంటలపాటు ఆ నోట్లను ముట్టుకోకూడదని సూచించారు. ఇక స్థానిక ప్రజలు కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.

సోషల్ మీడియాలో వీడియోనే కారణం కావొచ్చు...
ఈ విషయంపై మీడియా ప్రతినిధులు స్థానిక ప్రజలను ప్రశ్నించగా.. కరోనావైరస్ వ్యాప్తి చేయడం కోసమే ఎవరో ఆ నోట్లను ఇక్కడ పడేశారని చెప్పుకొచ్చారు. కరెన్సీ నోట్లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతోనే ప్రజలు ఆందోళన చెందుతున్నారని పోలీసులు చెబుతున్నారు.
Recommended Video

మహారాష్ట్రలో ఓ వ్యక్తి అరెస్టు..
మహారాష్ట్రలో ఓ వ్యక్తి కరెన్సీ నోట్లకు ముక్కులోని శ్లేష్మం అంటిస్తూ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. సదరు వ్యక్తి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇలాంటి చర్యలు సహించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications