కర్ణాటకలో అదృశ్యమైన కేరళ అమ్మాయి మృతదేహం లభ్యం
కర్ణాటకలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మూడు రోజుల కిందట అదృశ్యమైన కేరళ అమ్మాయి మృతదేహం లభ్యమైంది. ఇక్కడి పర్యటక ప్రాంతాలను సందర్శించడానికి కుటుంబ సభ్యులతో కలిసి కేరళ నుంచి వచ్చారా యువతి. చిక్ మగళూరు జిల్లాలో ట్రెక్కింగ్ కు వెళ్లి ప్రమాదానికి గురైంది. కాలుజారి 1,500 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. తాజాగా ఆ యువతి మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది గుర్తించారు.
మృతురాలి పేరు శ్రీనంద. కేరళలోని పాలక్కాడ్ ఆమె స్వస్థలం. కుటుంబ సభ్యుల, ఇతర పర్యాటకులతో కలిసి కర్ణాటకలో విహారానికి వచ్చారు. మొత్తం 40 మందితో కూడిన టూరిస్ట్ గ్రూప్ అది. తొలుత హంపి వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా చిక్ మగళూరుకు చేరుకున్నారు. అక్కడే బస చేశారు. ఈ నెల 7వ తేదీన దత్తపీఠం సమీపంలో ఎత్తైన పర్వతాల మధ్య గల మాణిక్యధార వాటర్ ఫాల్ ను సందర్శించడానికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె వెంట కుటుంబ సభ్యులెవరూ లేరు. ఇద్దరు, ముగ్గురు స్నేహితులు మాత్రమే ఉన్నారు.

మాణిక్యధార వాటర్ ఫాల్స్ వెళ్లిన అనంతరం శ్రీనంద కనిపించకుండా పోయారు. అదృశ్యం కావడానికి కొద్ది క్షణాల ముందు దత్తపీఠం పర్వతాలపై ఓ రీల్స్ చేశారు. దాన్ని తన తండ్రికి వాట్సప్ చేశారు. కుమార్తె కనిపించకపోవడం, ఫోన్ స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు అక్కడంతా వెదికారు. అయినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
శ్రీనందను గుర్తించడానికి అత్యాధునిక డ్రోన్లు, హైరిజాల్యూషన్ థర్మల్ కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాలను వినియోగించారు. ప్రత్యేక బృందాలను మోహరించారు. సుమారు వంద మంది రెస్క్యూ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. స్థానిక పోలీసులు, అగ్నిమాపక, పర్యాటకం, అటవీ సిబ్బంది, టూరిస్ట్ గైడ్స్.. వీరందరూ శ్రీనంద గాలింపు చర్యల్లో భాగం వహించారు. వారి అన్వేషణ విషాదంతంగా ముగిసింది.
ఈ మధ్యాహ్నం ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అరిసినగుప్పి నుండి అయిదు కిలో మీటర్ల దూరంలో 1,500 అడుగుల లోతైన లోయలో మృతదేహం లభించింది. వాటర్ ఫాల్స్ సమీపంలో మెట్లు దిగుతుండగా కాలుజారి కింద పడి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
-
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు












Click it and Unblock the Notifications