శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు, ముస్లీం ఓటర్లపై కాల్పులు, రాళ్లతో దాడి, నిప్పు, ఆందోళన !
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు శనివారం జరుగుతున్నాయి. శనివారం ముస్లీం ఓటర్లను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మద్య తీసుకు వెలుతున్న బస్సుల మీద గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపి రాళ్ల వర్షం కురిపించారు. బస్సులను అడ్డుకోవడానికి రోడ్ల మీద టైర్లకు నిప్పంటించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ముస్లీం ఓటర్లు వెలుతున్న బస్సులను అడ్డుకోవడానికి రోడ్ల మీద టైర్లు వేసి నిప్పంటించారు. శ్రీలంక నార్త్ వెస్ట్ ప్రాంతంలో ముస్లీం ఓటర్లు వెలుతున్న బస్సుల మీద ముసుగులు వేసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో కలకలం రేపింది.

విషయం గుర్తించిన పోలీసులు అదనపు బలగాలను సంఘటనా స్థలానికి తరలించి ముస్లీం ఓటర్లను సురక్షితంగా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. అయితే గుర్తు తెలియన వ్యక్తులు బస్సుల మీద కాల్పులు జరపడతో ఎలాంటి ప్రాణహాని జరగలేదని, పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రులకు తరలించామని పోలీసులు తెలిపారు.
శ్రీలంక కొత్త అధ్యక్షుడిని ఆదేశంలోని 1.59 కోట్ల మంది ఓటర్లు ఎన్నుకోనున్నారు. శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్ పార్టీ తరపున మాజీ డిఫెన్స్ సెక్రటరీ గొటబాయా రాజపక్స (70), అధికార పార్టీ అభ్యర్థి సాజిత్ ప్రేమదాస (52), నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ అభ్యర్థి అనుర కుమారా దిస్సనాయకేల మధ్య అధ్యక్షపదవిలో ప్రధాన పోటీ ఉంది.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 35 మంది పోటీ చేస్తున్నారు. అయితే 2015లో జరిగిన ఎన్నికల్లో శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన మైత్రిపాల సిరిసేన ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదు. అధికార పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీ అభ్యర్థి ప్రేమదాసకు ప్రజల్లో మంచి పేరు ఉంది.
సామాన్య మనిషిగా ప్రేమదాసకు ప్రజల్లో మంచి పట్టు ఉంది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణసింఘే ప్రేమదాస కుమారుడు ప్రేమదాసకు ప్రజలు ఎక్కువ మద్దతు ఇస్తున్నారని తెలిసింది. 1993లో ఎల్ టీటీ తీవ్రవాదులు రణసింఘే ప్రేమదాసను హత్య చేశారు. రణసింఘే ప్రేమదాస కుమారుడిగా ప్రేమదాసకు మంచి గుర్తింపు ఉంది. ఈ నెల 18వ తేదీ సోమవారం శ్రీలంక అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications