డార్విన్ సిద్ధాంతం తప్పు, చెప్పడం ఆపేయండి: కేంద్ర మంత్రి
ఔరంగాబాద్: చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జజీవ పరిణామక్రమ సిద్ధాంతాన్ని కేంద్ర మానవ వనరులు శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ తప్పు పట్టారు. డార్విన్ సిద్దాంతం తప్పు అని ఆయన అన్నారు.
మానవ జాతి భూమి మీద అలాగే ఉండేదని ఆయన అన్నారు. విద్యాసంస్థల్లో డార్విన్ సిద్ధాంతాన్ని పాఠంగా బోధించడం ఆపేయాలని ఆయన అన్నారు. డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతం గురించి ప్రాచీన భారతీయ గ్రంథాల్లో ఎక్కడా లేదని ఆయన అన్నారు.
డార్విన్ జీవ పరిణామ క్రమ సిద్ధాంతం శాస్త్రీయంగా కూడా నిరూపితం కాలేదని ఆన అన్నారు. భూమి ఏర్పడినప్పటి నుంచి మనిషి మనిషిగానే సంచరిస్తున్నాడని, అలాగే ఎదిగాడని ఆయనఅన్నారు.
డార్విన్ సిద్దాంతం తప్పు అని 3 ఏల్ల కిందట శాస్త్రవేత్తలు నిరూపించారని అన్నారు. ఆ విషయాన్ని కూడా విద్యార్థులకు చెప్పాలని అన్నారు. నానా నానీ కథల్లో గాన రాతలో గానీ మానవుడు కోతుల నుంచి పరిణామ క్రమంలో అవతరించాడని చెప్పలేదని ఆయన అన్నారు.
ఔరంగాబాదులోని పోలీసు పబ్లిక్ స్కూల్ ఇష్టాగోష్టి సమావేశంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. సత్యపాల్ సింగ్ గతంలో కూడా పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.