Student: స్కూల్ లో అమ్మాయిలకు స్పెషల్ క్లాస్ అని చెప్పి ?, లెక్కల టీచర్ జీవితం ఫినిష్ !
చెన్నై/సేలం: ప్రభుత్వ స్కూల్ లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ స్కూల్ లో సుమారు వందల మంది అమ్మాయిలు, అబ్బాయిలు చదువుకుంటున్నారు. గత ఏడాది లెక్కల టీచర్ అదే స్కూల్ కు బదిలి అయ్యాడు. అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఎక్కువ పాఠాలు చెబుతున్న లెక్కలు మాస్టర్ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇటీవల స్కూల్ లో చదువుతున్న అమ్మాయికి స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి పిలుచుకుని వెళ్లి ఆమె మీద లైంగిక దాడి చేశాడని ఆరోపణలు ఉన్నారు. స్కూల్ లో అమ్మాయి మీద లైంగిక వేధింపులు జరిగాయని వెలుగు చూడటం కలకలం రేపింది.
Sadist: భార్య మూతి, ముక్కు ఒక్కటి చేసి ఫేస్ బుక్ లో పోస్టు, భార్య కూడా ఓ వీడియో పెట్టింది !
స్కూల్ లో 500 మంది విద్యార్థులు
తమిళనాడులోని సేలం జిల్లాలోని ఓమలూరులో ప్రభుత్వ పాఠశాల ఉంది. ప్రభుత్వ స్కూల్ లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ స్కూల్ లో 500 మందికి పైగా అమ్మాయిలు, అబ్బాయిలు చదువుకుంటున్నారు. ఓమలూరు పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో నివాసం ఉంటున్న అమ్మాయిలు, అబ్బాయిలు ఇదే స్కూల్ కు వెలుతున్నారు.
లెక్కల టీచర్ కామాంధుడు
గత ఏడాది కన్యాకుమారి జిల్లాకు చెందిన శరవణకుమార్ అలియాస్ శరవణ (42) అనే వ్యక్తి ఓమలూరు ప్రభుత్వ స్కూల్ కు లెక్కల టీచర్ గా బదిలి అయ్యాడు. అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఎక్కువ పాఠాలు చెబుతున్న లెక్కలు మాస్టర్ శరవణకుమార్ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడని ఆరోపణలు ఉన్నాయి.
లెక్కల మాస్టర్ లెక్కలు తారుమారు
బుధవారం స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న అమ్మాయికి స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి పిలుచుకుని వెళ్లిన టీచర్ శరవణకుమార్ ఆమె మీద లైంగిక దాడి చేశాడని ఆరోపణలు ఉన్నారు. ఇంటికి వెళ్లిన అమ్మాయి జరిగిన విషయం ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. అమ్మాయి కుటుంబ సభ్యులు జలగంధర్ పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గతంలో కూడా ఇలాగే చేసిన టీచర్ ?
కేసు నమోదు చేసిన పోలీసులు లెక్కల టీచర్ శరవణకుమార్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచి జైలుకు పంపించారు. ప్రభుత్వ స్కూల్ లో అమ్మాయి మీద లైంగిక వేధింపులు జరిగాయని వెలుగు చూడటం తమిళనాడులో కలకలం రేపింది. గతంలో కూడా లెక్కల మాస్టర్ శరవణకుమార్ అనేక మంది అమ్మాయిలను లైంగికవేధింపులకు గురి చేశాడని ఆరోపణలు ఉన్నాయి.