సాగు చట్టాలపై సుప్రీంతీర్పు రేపే -ఇప్పటికే కేంద్రంపై కోర్టు ఆగ్రహం -చర్చలు ఫలిస్తాయన్న తోమర్
వివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న తీరును తీవ్రంగా తప్పుపట్టిన సుప్రీంకోర్టు.. ఆ చట్టాలపై మంగళవారమే తీర్పు వెలువరించనుంది. రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగేదాకా చట్టాలపై స్టే ఇవ్వాలనుకుంటున్నట్లు సోమవారం నాటి విచారణలో స్పష్టం చేసిన కోర్టు.. తీర్పు ఎలా ఉండబోతున్నదో చెప్పకనే చెప్పింది.
''సాగు చట్టాల అమలును ప్రభుత్వం నిలిపివేయకపోతే.. మేం స్టే విధిస్తాం. సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదిస్తాం'' అని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. మళ్లీ విచారణ ఎప్పుడు ఉంటుందనేదానిపై ఒకింత తర్జనభర్జనల తర్వాత.. మంగళవారమే తీర్పు ఉంటుందని సుప్రీంకోర్టు వర్గాలు ప్రకటించాయి.

దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు దాదాపు 50 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నా.. చర్చల పేరుతో కాలయాపన తప్ప సమస్యల పరిష్కారం దిశగా కేంద్రం అడుగులు వేయకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఎట్టిపరిస్థితుల్లోనూ చట్టాలను వెనక్కి తీసుకోబోమని మోదీ సర్కార్ పట్టుపట్టిన వేళ.. సీజేఐ బెంచ్ వ్యాఖ్యలతో షాక్ తగిలినట్లయింది. మరోవైపు..
వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతు సంఘాల నేతలతో తదుపరి చర్చలు ఈ నెల 15న జరుపుతామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఈసారి చర్చల్లో సమస్యకు ఒక పరిష్కారం తప్పక వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నందున దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని ఆయన అన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications