ఆగని మరణాలు.. ఉత్తర్ప్రదేశ్లో మరో రైలు ప్రమాదం !!
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలోని చునార్ రైల్వే స్టేషన్ తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా పవిత్ర గంగా స్నానానికి వచ్చిన భక్తులు.. పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొని ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ వరుస ఘటనలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలు ఎం జరిగిందంటే.. ?
స్థానికుల సమాచారం ప్రకారం.. చోపాన్-ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నుంచి కొంత మంది ప్రయాణికులు చునార్ స్టేషన్లో ఫ్లాట్ఫామ్ వైపు కాకుండా పట్టాలపైకి నేరుగా దిగారు. దాంతో వారు ట్రాక్ దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. హౌరా-కల్కా నేతాజీ ఎక్స్ప్రెస్ వేగంగా అక్కడికి చేరింది. అయితే డ్రైవర్ వారిని గమనించి అత్యవసర బ్రేక్ వేసినా కానీ రైలు ఆగకపోవడంతో.. ఆరు మంది ప్రయాణికులు రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదానికి గురైన ప్రయాణికులు అందరూ చోపాన్ ప్రాంతం నుంచి వారణాసికి గంగాస్నానానికి బయల్దేరిన భక్తులు అని అధికారులు వెల్లడించారు. వారణాసి వెళ్లే తరుణంలో ఫ్లాట్ఫామ్కి బదులుగా పట్టాల వైపు దిగడం ఈ ప్రమాదానికి దారితీసిందని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే పోలీసులు, స్టేషన్ సిబ్బంది, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని మీర్జాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా.. కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ దుర్ఘటనపై ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ.. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించడంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. అంతే కాకుండా ఈ ఘటనపై భారత రైల్వే మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించబడింది. అలాగే బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఆర్థిక సహాయం ప్రకటించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు ప్రాంతీయ ప్రజలు రైల్వే శాఖపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. చునార్ స్టేషన్లో ఫ్లాట్ఫామ్ కనెక్టింగ్ బ్రిడ్జ్ లేకపోవడం, తగిన హెచ్చరికలు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ప్రయాణికులు ట్రాక్ దాటకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications