స్నేహితులతో కలిసి ఫిన్లాండ్ లో బయటకు వెళ్లిన టెక్కీ, బీచ్ లో శవమై కనిపించాడు !
చెన్నైకి చెందిన హరిసుతన్ (26) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఫిన్లాండ్ లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన హరిసుతన్ గత కొన్ని రోజులుగా మాయం అయ్యాడు.
చెన్నై: చెన్నైకి చెందిన హరిసుతన్ (26) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఫిన్లాండ్ లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన హరిసుతన్ గత కొన్ని రోజులుగా మాయం అయ్యాడు. స్థానిక పోలీసులు అతని కోసం గాలించగా సముంద్ర తీరంలో శవమై కనిపించాడు.
ఫిన్లాండ్ లోని టీసీఎస్ కంపెనీలో గత సంవత్సరం నుంచి హరిసుతన్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 8వ తేదీ స్నేహితులతో కలసి బయటకు వెళ్లాడు. చాలా రోజులు అయినా హరిసుతన్ నివాసం ఉంటున్న ఇంటికి చేరుకోలేదు. కార్యాలాయానికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.

చెన్నైలోని హరిసుతన్ కుటుంబ సభ్యులు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, ఫిన్లాండ్ లోని భారత రాయబారి కార్యాలయం అధికారి వాణి రావ్ కు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఫిన్లాండ్ లోని హెరిస్పారి బీచ్ లో హరిసుతన్ శవమై కనిపించాడు.
హరిసుతన్ ను ఎవరైనా హత్య చేశారా ? లేదా అతనే ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మరణించాడా ? లేక ఆత్మహత్య చేసుకున్నాడా ? అని విచారణ చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. హరిసుతన్ మరణించాడని ఫిన్లాండ్ లోని భారత రాయభారి కార్యాలయం అధికారి వాణి రావ్ దృవీకరించారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications