వ్యక్తిగత విషయాలను ప్రెండ్స్ కు షేర్ చేస్తోందని భార్యను హత్య చేసిన టెక్కీ ఏం చేశాడంటే?
మహరాష్ట్రలోని పూణెలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాకేష్ తమ పర్సనల్ విషయాలను భార్య ప్రెండ్స్ కు ఫేస్ బుక్ లో షేర్ చేస్తోందని ఆగ్రహంతో ఆమెను హత్య చేశాడు. తాను కూడ ఆత్మహత్య చేసుకొన్నాడు.
పూణె :సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు షేర్ చేసిందని విచక్షణ కోల్పోయిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భార్యను హత్య చేసి ఆ తర్వాత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.
మహరాష్ట్రలోని హడాస్పూర్ సమీపంలోని మంజ్రీ బడ్రక్ లోని శివ్ పార్క్ అపార్ట్ మెంట్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాకేష్ గంగుర్డే తన భార్య సోనాలీతో కలిసి నివాసం ఉంటున్నాడు.

భార్య , భర్తల మద్య కొంత కాలంగా వివాదాలు చోటుచేసుకొన్నాయి. సోనాలి తమ వివాహనికి సంబంధించిన సమాచారంతో పాటు వ్యక్తిగత విషయాలను కూడ ఆమె ఫేస్ బుక్ ప్రెండ్ కు షేర్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.
దీంతో సోనాలిని ఆయన హత్య చేసి తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆత్మహత్య చేసుకొనే ముందు ఆయన ఓ సూసైడ్ లెటర్ రాశాడు. సోనాలి నుండి పోన్ కలవడం లేదని ఆమె తల్లి సోదరుడు హర్షపవార్ కు తెలిపింది. గురువారం ప్లాట్ కు వెళ్ళిన హర్షపవార్ ప్లాట్ కు వెళ్లడంతో భార్య భర్తలు మరణించిన విషయం వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications