ఫోన్ చేసి మందు పార్టీకి పిలిచారు: బెంగళూరులో టెక్కీ దారుణ హత్య, ఫ్రెండ్ మాయం !
ఫోన్ చేసి మందు పార్టీకి ఆహ్వానించడంతో వెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురైన ఘటన బెంగళూరు నగరంలోని మడివాళ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బెంగళూరు: ఫోన్ చేసి మందు పార్టీకి ఆహ్వానించడంతో వెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురైన ఘటన బెంగళూరు నగరంలోని మడివాళ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అసోం నుంచి బెంగళూరు చేరుకుని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న ప్రణయ్ (24) అనే యువకుడు హత్యకు గురైనాడు.
బెంగళూరు నగరంలో ప్రసిద్ధి చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్రణయ్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి స్నేహితుడు ప్రణయ్ కు ఫోన్ చేసి మడివాళ సమీపంలోని తావరకెరెలో మందు పార్టీ ఏర్పాటు చేశామని, వెంటనే రావాలని చెప్పాడు.

స్నేహితుడు పిలిచాడని ప్రణయ్ నమ్మకంతో ఒంటరిగా వెళ్లాడు. తావరకెరె మెయిన్ రోడ్డులోని చాక్లెట్ ఫ్యాక్టరీ సమీపంలో ప్రణయ్ మీద కత్తులతో దాడి చేసి దారుణంగా చంపేశారు. సోమవారం విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారణ చెయ్యగా హత్యకు గురైయ్యింది సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రణయ్ అని వెలుగు చూసింది. ప్రణయ్ కు ఫోన్ చేసి పిలిచిన వ్యక్తి మాయం అయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు అన్నారు. ప్రణయ్ హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications