తేల్చని షిండే: కేబినెట్ తర్వాతే టీనా, రాయల టీనా?

అక్టోబర్ 3వ తేదీన మంత్రివర్గం తమకు అప్పగించిన పనిని పూర్తి చేశామని ఆయన చెప్పారు. జివోఎం సిఫార్సులపై రేపు గురువారం మంత్రివర్గ సమావేశంలో చర్చ జరుగుతుందని ఆయన చెప్పారు. రేపు జివోఎం నివేదిక, ముసాయిదా బిల్లు మంత్రి వర్గ సమావేశం ముందుకు వస్తుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు - 2013ను జివోఎం ఖరారు చేసింది. రేపు సాయంత్రం ఐదు గంటలకు మంత్రి వర్గ సమావేశం జరుగుతుంది.
రేపు సాయంత్రం ఐదు గంటలకు మంత్రివర్గం సమావేశమైన చర్చించి నిర్ణయం తీసుకునే వరకు 12 జిల్లాల తెలంగాణనా, పది జిల్లాల తెలంగాణనా అనే సస్పెన్షన్ కొనసాగనుంది. చివరి సమావేశానికి కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ మినహా మిగతా జివోఎం సభ్యులంతా హాజరయ్యారు. జివోఎం రాష్ట్ర విభజనకు సంబంధించి 25 పేజీల నివేదికను, 70 పేజీల ముసాయిదా బిల్లును రూపొందించింది.
జివోఎం 11 అంశాలపై చర్చించి, వాటిపై తన సిఫార్సులను ఖరారు చేసింది. రేపు సాయంత్రం మంత్రి వర్గం ముసాయిదా బిల్లును ఆమోదించిన తర్వాత అది రాష్ట్రపతికి వెళ్తుందని, ఆ తర్వాత రాష్ట్ర శాసనసభకు అభిప్రాయం కోసం వెళ్తుందని చెబుతున్నారు. రాయల తెలంగాణ ప్రత్యామ్నాయం ఉందని సమావేశానికి ముందు జివోఎం సభ్యుడు జైరాం రమేష్ మీడియాతో చెప్పారు. 12 జిల్లాల తెలంగాణ వైపే జివోఎం మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications