తేల్చని షిండే: కేబినెట్ తర్వాతే టీనా, రాయల టీనా?

అక్టోబర్ 3వ తేదీన మంత్రివర్గం తమకు అప్పగించిన పనిని పూర్తి చేశామని ఆయన చెప్పారు. జివోఎం సిఫార్సులపై రేపు గురువారం మంత్రివర్గ సమావేశంలో చర్చ జరుగుతుందని ఆయన చెప్పారు. రేపు జివోఎం నివేదిక, ముసాయిదా బిల్లు మంత్రి వర్గ సమావేశం ముందుకు వస్తుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు - 2013ను జివోఎం ఖరారు చేసింది. రేపు సాయంత్రం ఐదు గంటలకు మంత్రి వర్గ సమావేశం జరుగుతుంది.
రేపు సాయంత్రం ఐదు గంటలకు మంత్రివర్గం సమావేశమైన చర్చించి నిర్ణయం తీసుకునే వరకు 12 జిల్లాల తెలంగాణనా, పది జిల్లాల తెలంగాణనా అనే సస్పెన్షన్ కొనసాగనుంది. చివరి సమావేశానికి కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ మినహా మిగతా జివోఎం సభ్యులంతా హాజరయ్యారు. జివోఎం రాష్ట్ర విభజనకు సంబంధించి 25 పేజీల నివేదికను, 70 పేజీల ముసాయిదా బిల్లును రూపొందించింది.
జివోఎం 11 అంశాలపై చర్చించి, వాటిపై తన సిఫార్సులను ఖరారు చేసింది. రేపు సాయంత్రం మంత్రి వర్గం ముసాయిదా బిల్లును ఆమోదించిన తర్వాత అది రాష్ట్రపతికి వెళ్తుందని, ఆ తర్వాత రాష్ట్ర శాసనసభకు అభిప్రాయం కోసం వెళ్తుందని చెబుతున్నారు. రాయల తెలంగాణ ప్రత్యామ్నాయం ఉందని సమావేశానికి ముందు జివోఎం సభ్యుడు జైరాం రమేష్ మీడియాతో చెప్పారు. 12 జిల్లాల తెలంగాణ వైపే జివోఎం మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications