బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మృతి: నక్సలైట్లకు ఎదురుదెబ్బ
నయారాయపూర్: ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని చెబుతున్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ చోటు చేసుకున్న ప్రాంతం ఇంద్రావతి నది సమీపంలో ఉంటుంది.
ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా దళాలు ధృవీకరించాయి. మాడ్ అటవీ ప్రాంతంలో జవాన్లు కూంబింగ్కు వెళ్లారు. ఈ సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. లొంగిపోవాలని జవాన్లు హెచ్చరించినా వారు వినకుండా కాల్పులకు తెగబడ్డారు.

దీంతో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పదిమంది నక్సలైట్లు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ అనంతరం ఆ ప్రదేశానికి అదనపు బలగాలను తరలించారు. అడవిని జల్లెడ పడుతున్నారు.
ఇటీవలి కాలంలో నక్సలైట్లకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తమకు తగులుతున్న ఎదురుదెబ్బల అనంతరం.. ఇటీవల ఏపీలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేను నక్సలైట్లు చంపేశారు. పలు సందర్భాల్లో పోలీసులకు సవాల్ చేశారు. తాము పుంజుకుంటామని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్లీ పదిమంది నక్సలైట్లు చనిపోవడం పెద్ద ఎదురుదెబ్బ.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications