పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!!
పండుగ వేళ కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పెట్రో ఉత్పత్తుల పైన కేంద్రం అదనపు ఎక్సైజ్ పన్ను భారీగా తగ్గించింది. పశ్చిమాసియా లో ఉద్రిక్తతల కారణంగా ఇంధన కొరత వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వంట గ్యాస్ ధరలను కేంద్రం భారీగా పెంచింది. కొరత కొనసాగుతున్న వేళ కేంద్రం ఉపశమన చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఈ రోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. దీనికి ముందుగానే ఎక్సైజ్ పన్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి.
వాహనాల వినియోగ దారులకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. పెట్రో ఉత్పత్తుల పైన కేంద్రం అదనపు ఎక్సైజ్ పన్నును భారీగా తగ్గించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. పెట్రోల్, డీజిల్ పైన రూ 10 రూపాయల మేర ఎక్సైజ్ పన్ను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తో ఇప్పుడు వీటి ధరల తగ్గింపు పైన ఆయిల్ కంపెనీలు అధికారికంగా ప్రకటన చేయనున్నాయి. పెట్రోల్ పై ఉన్న రూ 13 రూపాయల సుంకాన్ని రూ 3కి తగ్గించిన కేంద్రం.. డీజిల్ పైన ఉన్న సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. దీని ద్వారా పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గటం ఖాయంగా కనిపిస్తోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ... కేంద్రం అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఈ సాయంత్రం ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహించే సమావేశం లోనూ రాష్ట్రాల పరిధిలోనూ పన్నులు తగ్గించే అంశం పరిశీలించాలని సూచించే అవకాశం ఉంది.

అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. వంట గ్యాస్ టాక్స్ లపై నిర్ణయం
అటు ఎల్పీజీ ధరలను పెంచిన కేంద్రం.. ఉత్పత్తి మెరుగు పడిన తరువాత వాటిని తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పటి వరకు రాష్ట్రాల పరిధిలో పన్ను శాతం తగ్గింపు పైన పరిశీలన చేయాలని కేంద్రం సూచన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించటంతో.. రాష్ట్రాల పరిధిలోనూ కొంత మేర తగ్గించే అవకాశం పరిశీలనకు వస్తోంది. దీంతో.. పెరిగిన ధరలు కొంత మేర తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఇప్పుడు కేంద్రం అదనపు ఎక్సైజ్ సుంకం తగ్గించటంతో.. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్.. డీజిల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
-
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం













Click it and Unblock the Notifications