Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోదీ పర్యటన హోటల్ బిల్లు రూ. 80 లక్షలు పెండింగ్, చర్యలు తీసుకుంటామని హెచ్చరిక!

ఏడాది క్రితం మైసూర్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఓ హోటల్‌లో బస చేశారు. ఈ హోటల్ బిల్లు 80.6 లక్షల రూపాయలు. ఈ బిల్లు ఇంకా చెల్లించలేదని వెలుగు చూసింది. అందువల్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోటల్ యాజమాన్యం సంబంధిత అధికారులను హెచ్చరించింది. అధికారుల సమన్వయలోపం వలన ప్రధాన నరేంద్ర మోదీ ఏడాది క్రిందట చేపట్టిన పర్యటన ఇప్పుడు వివాదానికి కారణం అయ్యింది.

నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA), పర్యావరణ, అటవీ శాఖ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MOEF) నిర్వహించిన ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ 2023 ఏప్రిల్ నెలలో మైసూరు వెళ్లారు. మైసూరులో ఏప్రిల్ 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రూ. 3 కోట్ల వ్యయంతో ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమం నిర్వహించాలని ఆరాష్ట్ర అటవీశాఖకు ఆదేశాలు అందాయి.

The hotel management issued notices for not paying the bill of Rs 80 6 lakh for the stay of PM Narendra Modi

ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 100% నిధులు అందిస్తామని, ఆర్థికంగా సహకరిస్తామని హామీ ఇచ్చింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం షార్ట్ నోటీసుపై నిర్వహించబడింది. కార్యక్రమం మొత్తం వ్యయం మొత్తం రూ.6.33 కోట్లకు పెరిగింది. కేంద్రం రూ. 3 కోట్లు విడుదల చేసినప్పటికీ, కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ, ఎంఓఈఎఫ్‌ల మధ్య సమాచార మార్పిడి జరిగినప్పటికీ రూ.3. 33 కోట్లు లోటు వచ్చింది.

తరువాత సంబంధిత అధికారుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల పరిశీలన ఈవెంట్ ఖర్చు రూ. 3 కోట్లు అని సూచిస్తుంది. కానీ NTCA అధికారులు ఇచ్చిన సూచనల ప్రకారం, ప్రధాన మంత్రి మోదీ కార్యక్రమం యొక్క అవసరాల ప్రకారం, కొన్ని అదనపు కార్యకలాపాలు జోడించారు. కాబట్టి ప్రోగ్రామ్‌ను అవుట్‌సోర్స్ చేసిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ సవరించిన రేటు జాబితాను సమర్పించింది. అది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులందరికీ అందించబడింది.

బిల్లు చెల్లించాలని కర్ణాటక రాష్ట్రం నుండి సంబంధిత అధికారులకు లేఖ రాశారని తెలిసింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) కర్ణాటక అధికారులు 2023 సెప్టెంబరు 29వ తేదీన న్యూ ఢిల్లీలోని NTCA డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు లేఖ రాసి బకాయి ఉన్న మొత్తం గురించి గుర్తు చేసింది. అయితే, 2024 ఫిబ్రవరి 12వ తేదీన నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ స్పందిస్తూ మైసూర్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజాలో ప్రధాని నరేంద్ర మోదీ బస చేసినందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని పేర్కొంది.

తరువాత 2024 మార్చి 22వ తేదీన మరో లేఖను ప్రస్తుత పిసిసిఎఫ్ సుభాష్ మరోసారి లేఖ రాశారు. మైసూరులోని రాడిసన్ బ్లూ ప్లాజాలో ప్రధాని నరేంద్ర మోదీ బస చేసిన హోటల్ బిల్లులను క్లియరెన్స్ చేయకపోవడంతోపాటు రూ.80. 6 లక్షల బకాయిలు ఉన్నాయని ఎన్‌టీసీఏకు గుర్తు చేశారు. అయితే ఢిల్లీలోని అధికారుల నుంచి ఇప్పటి వరకు సమాధానం రాలేదని తెలిసింది.

ఇంతలో రాడిసన్ బ్లూ ప్లాజా యొక్క జనరల్ మేనేజర్ ఆఫ్ ఫైనాన్స్ అధికారులు 2024 మే 21వ తేదీన డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి బసవరాజుకి లేఖ రాస్తూ మా హోటల్ సేవలను పొంది 12 నెలలు గడిచినా ఇంత వరకు బిల్లులు చెల్లించకపోవడం గురించి గుర్తుచేస్తున్నారు. పెండింగ్ బిల్లుల గురించి చెప్పినా, నోటీసులు ఇచ్చినా ఈ బిల్లులు చెల్లించలేదని లేఖలో పేర్కొన్నారు. బకాయి ఉన్న బ్యాలెన్స్‌లపై ఆలస్య చెల్లింపు వడ్డీ సంవత్సరానికి 18% వర్తిస్తుంది.

అందుకే పెండింగ్ బిల్లులతో పాటు రూ. 12.09 లక్షలు అదనంగా ఇవ్వాలని లేఖ రాశారు. 2024 జూన్ 1వ తేదీలోగా బకాయిలు చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోటల్ యాజమాన్యం సంబంధిత అధికారులను హెచ్చరించింది. ఇంకా డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ బసవరాజును సంప్రదించగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించేందుకు నిరాకరించింది. ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమని వాదిస్తూ ఆ మొత్తాన్ని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+