తిరుమలలో ఇది పరిస్థితి, చిరుత దాడితో నడక మార్గంలో భక్తులను ఇలాగే !
తిరుమల/తిరుపతి: కలియుగ వైకుంఠ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వెలసిన తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరుగుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గురువారం శ్రీవారిని 67, 294 మంది భక్తులు దర్శించుకున్నారు. గురువారం రాత్రి వరకు 33, 529 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న భక్తులు స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4 కోట్ల 9 లక్షలు సమర్పించుకున్నారు. గురువారం తిరుమలలోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి క్యూ లైన్ బయటకు వచ్చి టీబీసీ గెస్ట్ హౌస్ వరకు పెరిగిపోయింది. ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం టోకన్లు లేని భక్తులకు స్వామి వారిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోందని శుక్రవారం ఉదయం టీటీడీ పీఆర్ వో అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

తిరుమల కాలినడక మార్గంలోని 7వ మైలు దగ్గర ఓ చిరుత బాలుడి మీద దాడి చెయ్యడం కలకలం రేపింది. తిరుమతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిలో గాయపడిన కౌషిక్ అనే చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆధోనికి చెందిన కౌసిక్ కోలుకుంటున్నాడని, ఆ చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని అధికారులు అంటున్నారు.

ఇదే సమయంలో తిరుమల కాలినడక మార్గంలో టీటీడీ అటవి శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. టీటీటీ అటవి శాఖ అధికారులు పోలీసులు తిరుమల కాలినడక మార్గంలో ఎప్పటికప్పుడు సంచరిస్తూ అటవి ప్రాంతం నుంచి జంతువులు కాలినడ మార్గంలోకి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

తిరుమల కాలినడక మార్గంలో బాలుడి మీద చిరుత దాడి చెయ్యడం బాధకరమని, మరోసారి ఇలాంటి సంటనలు ఎదురుకాకుండా చూసుకుంటామని టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి అన్నారు. అలిపిరి-తిరుమల కాలి నడక మార్గంలో శ్రీవారి భక్తులను గుంపులు గుంపులుగా పంపించాలని నిర్ణయించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. భక్తులు గుంపులుగా వెలుతుంటే జంతువులు దాడి చేసే అవకాశం ఉండదని టీటీడీ అటవి శాఖ అధికారులు అంటున్నారు.
-
85,000 శ్రీవారి లడ్డూలు సిద్ధం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications