రిజర్వేషన్ల గొడవ: వసుంధర రాజే ముందు జాగ్రత్త
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ తీసుకున్న సరికొత్త నిర్ణయం వలన ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా 68 శాతానికి చేరింది. చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు. గుజరాత్లో హార్దిక్ పటేల్ ఉద్యమం నేపథ్యంలో వసుంధర రాజే ముందు జాగ్రత్త తీసుకుని వ్యూహాత్మకంగా గుజ్జర్లకు, ఈబిసిలకు రిజర్వేషన్లు కల్పించినట్లు భావిస్తున్నారు.
వాస్తవానికి చట్టపరంగా గరిష్టంగా మొత్తం రిజర్వేషన్లు కలిపి 50 శాతం దాటకూడదు. అయితే రాజస్థాన్ ప్రభుత్వం మంగళవారం సరికొత్త నిర్ణయం తీసుకుంది. అక్కడి గుజ్జర్లకు ప్రత్యేక బీసీ (ఎస్ బీసీ) కోటా కింద ఐదు శాతం, ఆర్థికంగా వెనుకబడిన వారికి (ఈబీసీ) 14 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆమోదించారు.

అసెంబ్లీలో ఆమోదించిన రెండు బిల్లులను రాజ్యంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చడం ద్వారా వాటికి న్యాయపరమైన అడ్డంకులురాకుండా చూడాలని వసుంధర రాజె ప్రభుత్వం కేంద్రానికి మనవి చేసింది.
రిజర్వేషన్ల వ్యవస్థనే మొత్తం సమీక్షించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన ఒక్క రోజు తరువాత రాజస్థాన్ లోని బీజేపీ సర్కారు ఈ సంచలనమైన నిర్ణయం తీసుకునింది. ఈ దెబ్బతో ఆర్ఎస్ఎస్ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications