ఇదిగో సాక్ష్యం: సెల్ఫీలు ప్రాణాలు తీయడమే కాదు...ప్రాణాలు కూడా నిలబెడుతాయి.!
కొట్టాయం: రెండేళ్ల క్రితం హైదరాబాదులోని భరత్నగర్ రైల్వేస్టేషన్లో ఓ యువకుడు రైలు వస్తుండగా సెల్ఫీ కోసం ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. ఇలా సెల్ఫీ మోజులో పడి నదిలో కొట్టుకుపోయిన వారున్నారు... ఇతర ప్రమాదాల బారిన పడి మృతి చెందిన వారున్నారు. అయితే ఈ ఘటనలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. ఆత్మహత్య చేసుకుందామనుకున్న వ్యక్తి సెల్ఫీనే అతన్ని ప్రాణాలతో కాపాడింది.
కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి భార్యతో గొడవై ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఇందుకోసం రైలుపట్టాలు పై పడుకొని తన బాధను చెప్పుకొని దాన్ని సెల్ఫీ తీసి తన స్నేహితులకు పంపాడు. తను ఇక బ్రతకదలుచుకోలేదని ప్రాణాలు తీసుకుంటున్నానంటూ చెప్పి వీడియో రికార్డు చేసి తన స్నేహితులకు పంపాడు. ఇది చూసిన తన స్నేహితులు అతన్ని కాపాడాలని భావించారు. అయితే తాను ఎక్కడున్నాడో తెలియదు. ఆ వీడియోలోనే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అదేపనిగా మళ్లీ చూశారు. అందులో ఓ పసుపు పచ్చ మైలురాయి కనిపించింది. అది రైల్వేకు సంబంధించిందని వెంటనే వారు రైల్వే అధికారులను సంప్రదించారు. ఆ మైలురాయి ఉన్న స్థలాన్ని రైల్వే అధికారులు గుర్తించారు.

న్యూఢిల్లీ నుంచి కేరళకు వెళుతున్న రైలులో వ్యక్తి స్నేహితుడు ఒకరు ఉన్నారు. వెంటనే ఆ వ్యక్తి రైలు డ్రైవర్ దగ్గరకు వెళ్లి ఆ వ్యక్తి ఉన్న ప్రదేశాన్ని గుర్తించాడు. మరోవైపు ఆ రూట్లలో వెళ్లే రైళ్లు నిదానంగా వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆ రూట్లో చిన్నగా వెళ్లాయి రైలు. ఆ వ్యక్తిని ప్రాణాలతో కాపాడగలిగారు. వెంటనే రైల్వే పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తి భార్యను కూడా పిలిపించి ఇద్దరికీ కౌన్సలింగ్ ఇచ్చారు. కాపురం అన్న తర్వాత చిన్న గొడవలు సహజమే అని వీటికే ప్రాణాలు తీసుకుంటే ఎలా అని మందలించారు పోలీసులు. మరోసారి గొడవ పడమని ఓ అండర్ టేకింగ్ లెటర్ను దంపతుల దగ్గర నుంచి తీసుకుని వారిని విడిచిపెట్టారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications