మూడు ప్లాన్స్: ఎమ్మెల్యేల తరలింపుకు కాంగ్రెస్, జేడీఎస్ వ్యూహం?
Recommended Video

బెంగళూరు: కర్ణాటక రాజకీయాలపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. రేపు సాయంత్రం 4.30కి యడ్యూరప్ప బలనిరూపణ పరీక్ష ఉండటంతో.. ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. వందకు నూటా ఒక్క శాతం తమదే విజయమని యడ్యూరప్ప చెబుతున్న మాటలే నిజమవుతాయా?.. లేక బలనిరూపణలో ఆ పార్టీ తేలిపోతుందా? అన్నది వేచి చూడాలి.
బలనిరూపణకు ఇంకా కొద్ది గంటలు మాత్రమే సమయం ఉండటంతో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను మరింత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న తమ ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించేందుకు పకడ్బంధీ ప్లాన్ వేస్తున్నాయి. ఎమ్మెల్యేల తరలింపు కోసం మూడు ప్లాన్లను సిద్దం చేసినట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యేల తరలింపుకు ప్లాన్-1:
ఏ క్షణమైనా ఎమ్మెల్యేలను తరలించడానికి రెండు ప్రత్యేక విమానాలను కాంగ్రెస్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఏ క్షణమైనా ఇక్కడి నుంచి బయలుదేరటానికి సిద్ధంగా ఉండాలంటూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఆదేశాలు అందాయి. ప్రత్యేక విమానాలు కాబట్టి గంటన్నరలో ఎమ్మెల్యేలు బెంగళూరుకు చేరుకోనున్నారు. అయితే నిన్న రాత్రి బెంగళూరులో డీజీసీఏ ప్రత్యేక విమానాన్ని నిరాకరించడంతో.. అలాంటి పరిస్థితి ఏమైనా తలెత్తితే వెంటనే ప్లాన్-2ను అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.

ప్లాన్-2:
ప్రత్యేక విమానాలకు అనుమతి నిరాకరిస్తే.. ఎమ్మెల్యేలను బస్సుల ద్వారా బెంగళూరుకి తరలించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం 4 ఏసీ స్లీపర్ బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. బస్సుల్లో అయితే బెంగళూరుకు 8గం. సమయం పట్టనుంది. నేతలు, కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ ఇస్తూ ఏపీ మీదుగా ఎమ్మెల్యేలను బెంగళూరును తరలించనున్నారు.

ప్లాన్-3:
ప్రత్యేక విమానాలు, బస్సులు ఈ రెండింటి ద్వారా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే కార్ల ద్వారా ఎమ్మెల్యేలను తరలించాలని ప్లాన్-3ని కూడా సిద్దం చేసింది బీజేపీ. ఒక్కో కారులో నలుగురు ఎమ్మెల్యేలను తరలించడానికి ప్లాన్ చేస్తోంది. మొత్తం మీద రేపటి బలనిరూపణలో యడ్యూరప్పను ఓడించబోతున్నామని కాంగ్రెస్, జేడీఎస్ లు ధీమాగా చెబుతున్నాయి.

సీఎల్పీ నేతగా సిద్దరామయ్య:
ఎమ్మెల్యేల తరలింపుకు ముందు తాజ్ క్రిష్ణ హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో.. మాజీ సీఎం సిద్దరామయ్యను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కూడా పాల్గొన్నారు. రేపు బలనిరూపణ సందర్భంగా అసెంబ్లీ ఎలా వ్యవహరించాలన్న దానిపై సభ్యులకు సలహాలు సూచనలు చేశారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications