జయలలిత ఆస్తులకు భారీ బందోబస్తు, మన్నార్ గుడి మాఫియా చొరబడుతుందని నిఘా!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన నివాసం పోయెస్ గార్డెన్, నీలగిరి జిల్లా కొటగిరిలోని కొడనాడు ఎస్టేట్ దగ్గర భద్రత కట్టుదిట్టం చెయ్యాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ఆదేశాలు జారీ చేశారు. పోయెస్ గార్డెన్, కొడనాడు ఎస్టేట్ దగ్గర పోలీసు బలగాలు మొహరిస్తున్నాయి.
పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంను జయలలిత స్మారక భవనంగా తీర్చిదిద్దుతామని సీఎం ఎడప్పాడి పళనిసామి చెప్పారు. పోయెస్ గార్డెన్ ఇక ప్రభుత్వానిదే అని పళనిసామి తేల్చి చెప్పారు. అయితే పోయెస్ గార్డెన్ అమ్మ స్మారక భవనంగా మార్చడానికి జయలలిత మేనకోడులు దీపా, ఆమె సోదరుడు దీపక్ వ్యతిరేకిస్తున్నారు.

జయలలిత ఆస్తులు అన్ని మావే, మేమే వారసులు అని దీపా, దీపక్ అంటున్నారు. ఈ సందర్బంలో పోయెస్ గార్డెన్, కొడనాడు ఎస్టేట్ దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక్కరిని కూడా పోయెస్ గార్డెన్ ఆవరణంలోని వేదనిలయం, కొడనాడు ఎస్టేట్ లోకి అనుమతించమని పోలీసు అధికారులు చెప్పారు.
కొడనాడు ఎస్టేట్ లోకి శశికళ కుటుంబ సభ్యులు చొరబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు పసిగట్టడం వలనే అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని తెలిసింది. కొడనాడు ఎస్టేట్ ప్రధాన ద్వారం మూసివేసి చుట్టు పక్కల బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు అటు వైపు వెలుతున్న వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications