వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యే దారుణ హత్య, పాయింట్ బ్లాంక్లో కాల్చారు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఓ ప్రజాప్రతినిధి దారుణ హత్యకు గురయ్యాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అతనిని పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపారు. అతను కృష్ణగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే.
ఈ సంఘటన నదియా జిల్లాలోని, కృష్ణగంజ్ నియోజకవర్గం పరిధిలోని ఫుల్బరి ప్రాంతంలో చోటు చేసుకుంది. అతను లోకల్ క్లబ్లో ఓ పూజకు వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. సంఘటన స్థలం నుంచి ఓ రివాల్వర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ హత్య జరిగిన సమయంలో అక్కడే రాష్ట్ర మంత్రి రత్నఘోష్ ఉన్నారు. రత్నఘోష్ పూజ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ సమయంలో హత్య గావింపబడిన ఎమ్మెల్యే సత్యజిత్ ఆమె (మంత్రి) పక్కనే నిలబడ్డారు.
Comments
English summary
Satyajit Biswas, Trinamool Congress (TMC) MLA from Krishnaganj area of Nadia district in West Bengal, was shot dead by unidentified men when he was attending a cultural programme on Saturday.
Story first published: Saturday, February 9, 2019, 21:42 [IST]