స్పీకర్ నోటీసులు: నేడు డెడ్ లైన్: అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, సీఎం పళని ?
తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన 18 మంది టీటీవీ దినకరన్ గ్రూప్ అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేల భవిష్యత్తు నేటితో (గురువారం) తేలిపోనుంది.
చెన్నై: తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన 18 మంది టీటీవీ దినకరన్ గ్రూప్ అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేల భవిష్యత్తు నేటితో (గురువారం) తేలిపోనుంది. తమిళనాడు స్పీకర్ ధనపాల్ ఇచ్చిన నోటీసులకు దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు గురువారం కచ్చితంగా సమాధానం ఇవ్వాల్సి ఉంది.
తమిళనాడు ప్రభుత్వం, సొంత పార్టీ మీద ఎందుకు తిరుగుబాటు చేశారు, పార్టీ నియమాలు ఎందుకు ఉల్లంఘించారు? అంటూ సమాధానం చెప్పాలంటూ ఆ రాష్ట్ర శాసన సభ స్పీకర్ ధనపాల్ టీటీవీ దినకరన్ గ్రూప్ లోని రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.

ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే పార్టీ చీప్ విప్ రాజేంద్రన్ స్పీకర్ ధనపాల్ కు ఫిర్యాదు చెయ్యడంతో గతంలో రెండు సార్లు నోటీసులు జారీ చేసినా దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు మాత్రం సమాధానం ఇవ్వలేదు.
మూడో సారి నోటీసులు జారీ చేసిన స్పీకర్ ధనపాల్ ప్రభుత్వం, పార్టీ మీద ఎందుకు తిరుగుబాటు చేశారు అంటూ గరువారం (సెప్టెంబర్ 14వ తేదీ)లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. గురువారం లోపు దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వకుంటే వారి మీద స్పీకర్ ధనపాల్ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
గురువారం తమిళనాడు ముఖ్య మంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సెక్రటేరియట్ లో మంత్రులు అందిరితో సమావేశం అయ్యి టీటీవీ దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేల విషయంలో ఏం చేద్దాం అంటూ చర్చించి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications