పురుషత్వం లేని భర్తపై మహిళ అత్యాచారం కేసు
న్యూఢిల్లీ: పురుషత్వం లేని భర్తను వదిలించుకోవడానికి ఓ మహిళ తప్పుడు అత్యాచారం కేసు పెట్టింది. దాంతో తనను బెదిరిస్తున్నారని, తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ పెట్టిన కేసును స్థానిక కోర్టు కొట్టేసింది.
పురుషత్వం లేని తన భర్తను వదిలించుకోవడానికి తాను తప్పు కేసు పెట్టినట్లు మహిళ అంగీకరించినట్లు న్యాయమూర్తి వీరేంద్ర భట్ చెప్పారు. ఆ కారణంగానే మహిళ తన తల్లిగారంటికి వెళ్లిపోయి తప్పు కేసు పెట్టిందని చెప్పారు.
తనపై అత్యాచారం చేశారనే ఆరోపణతో పాటు తన బావ మరిది తన అసహజమైన శృంగారానికి పాల్పడ్డాడని, తన మామ తనపై అత్యాచారానికి ప్రయత్నించాడని మహిళ కేసు పెట్టింది. విడాకులు తీసుకునేందుకు వారిపై ఒత్తిడి పెట్టేందుకే ఈ కేసు పెట్టినట్లు న్యాయమూర్తి చెప్పారు.
మహిళ భర్తను, అత్తామామలను, ముగ్గురు బావామరుదులను, ఇద్దరు వదినలను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. కేసు విచారణలో ఉండగానే అత్తింటివారితో, భర్తతో మహిళ ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది.
చివరకు విడాకులు పొందే విషయంలో మహిళ విజయం సాధించిందని, అలాగే తనకు భరణాన్ని కూడా సాధించుకుందని కోర్టు తెలిపింది. 2014లో ఆమె భర్తపై, అత్తింటివారిపై ఫిర్యాదు చేసింది.