టోల్ పోటు నిరంతర ప్రక్రియ.. మంచి రోడ్ల కోసమేనని సెలవిచ్చిన మంత్రి
న్యూఢిల్లీ : ఫోర్ వీలర్ యాజమానులారా .. అలర్ట్, ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులా, అలర్ట్, అలర్ట్, దేశంలోని జాతీయ రహదారులపై యధేచ్చగా టోల్ బాదుడు ఉంటుందట. టోల్ ట్యాక్స్ ఆగిపోవడం అనేది ఉండదట. ధరల్లో మాత్రం మార్పులు ఉంటాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సెలవిచ్చారు. మంగళవారం పార్లమెంట్లో మాట్లాడుతూ .. వాహనదారులకు షాకిచ్చారు గడ్కరీ.
మంచిరోడ్ల
కోసమట
..
దేశంలో
టోల్
ట్యాక్స్
బాదుడు
నిరంతర
ప్రక్రియ
అని
స్పష్టంచేశారు
కేంద్రమంత్రి
నితిన్
గడ్కరీ.
ఇందుకు
గల
కారణాన్ని
కూడా
వివరించారు.
దేశంలో
మంచిరోడ్లు
నిర్మించుకోవాలంటే
టోల్
విధానం
తప్పనిసరి
అని
తేల్చిచెప్పారు.
టోల్
ధరలు
ఎప్పటికప్పుడు
మారొచ్చని
..
అయితే
పూర్తిగా
లేకుండా
మాత్రం
ఉండబోదని
చెప్పి
షాకిచ్చారు.
దీంతో
దేశంలో
ఆయా
రోడ్లలో
టోల్
ట్యాక్స్
బాదుడు
ఉంటుందని
కారు
యాజమానులకు
తేల్చిచెప్పారు.
దేశంలో టోల్ ట్యాక్స్ ఎప్పటినుంచో ఉందని .. చిన్నప్పటి నుంచి చూస్తున్నానని పేర్కొన్నారు. మరిన్ని మంచి రహదారులు, సర్వీస్ కావాలంటే టోల్ చెల్లించాల్సిందేనని స్పష్టంచేశారు. టోల్ ట్యాక్స్తో గ్రామీణ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో రోడ్లను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో 40 వేల కిలోమీటర్ల మేర హైవేలు నిర్మించినట్టు పేర్కొన్నారు.