అజ్ఞాతంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు, బీజేపీకేనా?: కాంగ్రెస్ ఆందోళన
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో యడ్యూరప్ప బలనిరూపణ పరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల ఆచూకీ దొరకకపోవడం ఆ పార్టీలో కొంత ఆందోళనకు గురిచేస్తోంది.
రాయచూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్, విజయనగర నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనంద్ సింగ్లు శనివారం ఉదయం వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. వీరిద్దరూ కూడా బీజేపీకి మద్దతు తెలిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అయితే, కాంగ్రెస్ మాత్రం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్-జేడీఎస్లకే మద్దతుగా ఉంటారని చెబుతున్నారు. ఆనంద్ సింగ్ ఫోన్లో తమకు టచ్లో ఉన్నారని కాంగ్రెస్ చెబుతోంది.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శనివారం సాయంత్రం 4గంటలకు కర్ణాటక అసెంబ్లీలో యడ్యూరప్ప ప్రభుత్వం బలనిరూపణకు సిద్ధమైంది. తాము బలపరీక్షలో నెగ్గి ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని బీజేపీ చెబుతుండగా, బీజేపీకి మెజార్టీ లేదని, ఓటమి ఖాయమని కాంగ్రెస్-జేడీఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..











Click it and Unblock the Notifications